Tarakaratna: నందమూరి తారకరత్న ఇకలేరనే వార్త నందమూరి అభిమానులలోను టిడిపి కార్యకర్తలలోనూ తీవ్ర విషాదం నింపింది.లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ పాల్గొన్నటువంటి తారకరత్న ఉన్నపలంగా హార్ట్ స్ట్రోక్ రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఈయనను సమీప ఆసుపత్రికి తరలించే అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
ఇలా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఈయనకు ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో గత 23 రోజులగా వెండిలేటర్ పై చికిత్స అందుతుంది. ఇలా 23 రోజుల నుంచి నిపుణుల సమక్షంలో చికిత్స అందుతున్నప్పటికీ ఈయన ఆరోగ్య విషయంలో ఏ మాత్రం మెరుగు కనిపించకపోవడంతో ఒకవైపు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూనే వచ్చారు.
తారకరత్న విషయంలో నందమూరి కుటుంబ సభ్యులకు కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. పెద్ద ఎత్తున పూజలు హోమాలు కూడా చేశారు. ఇలా ఒకవైపు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ తారకరత్న ప్రాణాలు కోల్పోవడానికి అసలు కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.
ఈ విధంగా 23 రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నటువంటి తారకరత్న ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఆయన బ్రెయిన్ ఫంక్షన్స్ జరగకపోవడమే. ఈయన పాదయాత్రలో హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆ ప్రభావం మెదడుపై పడిందని దాంతో మెదడు పనితీరు తగ్గిపోవడం వల్ల ఈయన వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ ఆయన శరీరం వైద్యానికి సహకరించలేదని అలాగే వైద్యులు ఎంతో శ్రమించినప్పటికీ ఆయన మెదడు పనితీరులో ఏమాత్రం మెరుగు లేకపోవడంతోనే ఆయన మరణించారని తెలుస్తోంది.ఏది ఏమైనా క్షేమంగా తిరిగి వస్తారు అనుకున్న తారకరత్న ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…