Tarakaratna Friend Suresh : నందమూరి తారకరత్న విషయంలో ఎవరూ ఊహించని విషాదం ఆయన కుటుంబాన్ని కమ్మేసింది. నలభై ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించి ఆయన కుటుంబాన్ని శోక సంద్రంలో నెట్టారు. తారకరత్న గారు సినిమాల్లో అంతగా రానించకపోయినా మంచి వాగ్దాటి ఉండటంతో టీడీపీ లో ఈసారి ఎమ్మెల్యే కి పోటీచేయాలని భావించారు. అయితే ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు ఆయన అందరికీ శాశ్వతంగా దూరమయ్యరు. ఆయన వ్యక్తగత జీవితంలోనూ ఇప్పుడిప్పుడే తన ప్రేమ వివాహం వల్ల దూరమైన కుటుంబం మళ్ళీ కలుసుకుంటారు అనుకునే సమయానికి ఆయనే శాశ్వతంగా దూరం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అలేఖ్య రెడ్డికి అందరూ ధైర్యం చెబుతున్నారు. ఇక తారకరత్న ఫ్రెండ్ సురేష్ అలేఖ్య రెడ్డి తారకరత్న బాండింగ్ గురించి వివరించారు.
అలేఖ్య రెడ్డి ఇచ్చిన అతి పెద్ధ గిఫ్ట్ అదే…
తారకరత్న ఎవరినైనా ఇష్టపడితే వారిని అసలు వదిలి పెట్టడంటూ సురేష్ చెప్పారు. తాను ఫ్రెండ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడని చెప్పారు. ఇక అలేఖ్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తారకరత్న పెళ్లి రోజు అలేఖ్య మన పెళ్ళికి మన కుటుంబం ఎవరూ లేరని బాధపడుతుంటే నీకన్నా నీ చెల్లి వచ్చింది నాకంటూ మా కుటుంబం నుండి ఒక్కరూ లేరు నాకన్నా నువ్వే లక్కీ అంటూ చెప్పాడట. ఇక పెళ్లయ్యాక అలేఖ్య ఫ్యామిలీ తారకరత్న ను కొడుకులాగ చూసుకున్నారంటూ చెప్పారు సురేష్.
ఇక బాబాయ్ బాలకృష్ణ అంటే తారకరత్న కు ఎంత ఇష్టమో అలేఖ్య కు బాగా తెలుసు, అందుకే తారకరత్న పుట్టినరోజుకు బాలకృష్ణ ను పిలిచి తారకరత్న కు సర్ప్రైజ్ చేసింది. ఆరోజు తారక్ ఎంత త్రిల్ అయ్యాడో మాటల్లో చెప్పలేను. ప్రతిసారి ఏదో ఒక స్పెషల్ డే కో లేక బర్త్ డే కో తారకరత్న కు వాచ్ లాంటివి ఇష్టమని అవి గిఫ్ట్ గా ఇస్తూ ఉంటుంది అలేఖ్య అంటూ వారి బాండింగ్ గురించి చెప్పారు సురేష్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…