Tarakaratna: నందమూరి తారకరత్న మరణించడంతో ఒక్కసారిగా ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నందమూరి తారకరత్న మరణం తన భార్య అలేఖ్యను ఎంతగానో కృంగతీసింది. ఇక తారకరత్న మరణించడంతో అలేఖ్య రెడ్డి దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఇక తారకరత్న అంత్యక్రియల సమయంలో కూడా అలేఖ్య రెడ్డి రోదన అందరిని కంటతడి పెట్టించింది. ఈమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇలా తన భర్త ఇక రారనే చేదువార్తను దిగమింగలేక ఈమె ఏకధాటిగా కంటతడి పెట్టుకున్నారు. తారకరత్న చిన్న కర్మ సమయంలో కూడా ఈమె తన భర్తను తలుచుకొని ఎంతో కుమిలిపోయారు.
ఇక తారకరత్న మరణించడంతో అలేఖ్య రెడ్డి మొదటిసారి తన భర్త మరణం తర్వాత ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి చేత కంటతడి పెట్టిస్తుంది. ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి పోస్ట్ చేస్తూ… మనం మన ప్రయాణంలో ఎన్నో పోరాటాలు చేసాం..నీ చివరి రోజుల వరకు ఫైట్ చేసావ్ కార్లలో నిద్రపోయిన రోజుల నుంచి ప్రస్తుతం వరకు మన జీవితం అంత సాఫీగా సాగలేదు.
ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేసాం.. నువ్వు ఒక వారియర్ నాన్న..నువ్వు మాపై చూపించినంత ప్రేమ ఇంకెవరు చూపించలేరు అంటూ తారకరత్న చేతిలో చేయి వేసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఈమె ఎమోషనల్ అయ్యారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది అలేఖ్య తొందరగా ఈ బాధ నుంచి బయట పడాలని, భగవంతుడు ఆమెను మంచిగా చూడాలని కామెంట్లు చేస్తున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…