అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో ఓ మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒంటరిగా జీవిస్తున్న తనకు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)లో తన కూతురికి సీటు కావాలంటూ అడిగినప్పుడు, టీడీపీ నేత వన్నూరప్ప లైంగికంగా వేధించాడని బాధితురాలు మండిపడింది.
వీడియో ప్రకారం బాధితురాలు చేసిన ఆరోపణల ప్రకారం సీటు ఇప్పించాలంటే ముందుగా రూ.10 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన వన్నూరప్ప, డబ్బు లేకపోతే తన కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. అంతేకాకుండా, ఆమెను మళ్లీ స్కూల్లో ఉద్యోగం ఇస్తానని నెలకు రూ.6 వేలు జీతం ఉంటుందని చెప్పిన వన్నూరప్ప, తన ఇంటి బాధ్యత మొత్తం తానే తీసుకుంటానంటూ ఆకర్షించే మాటలతో ప్రభావితం చేయాలని ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.
తన స్వభిమానం దెబ్బతినడంతో బాధితురాలు గట్టిగా స్పందించింది. “సీటు ఇప్పిస్తే సరే… డబ్బులు కూడా ఇస్తా, కానీ నీలా గలీజుగా ప్రవర్తిస్తే చెప్పుతో కొడతా” అంటూ స్పష్టం చేసింది. మరోసారి ఫోన్ చేస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చర్యల కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని నెటిజన్లు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…