టాలీవుడ్ యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ పెద్ద వివాదానికి కారణమైంది. వార్-2 సినిమా విడుదల సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్, తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు మధ్య సంభాషణ జరిగిందని చెబుతున్న ఒక ఆడియోలో, “నేను అనంతపురం ఎమ్మెల్యే.. సినిమా ఆడదు” అని ప్రసాద్ వ్యాఖ్యానించినట్లుగా ఉంది. ఈ ఆడియో నెట్టింట వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
ఈ ఆడియోపై స్పందించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అది తనది కాదని గట్టిగా ఖండించారు. ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమని, గత 16 నెలలుగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. “నేను ఎప్పటినుంచో నందమూరి కుటుంబ అభిమానిని. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలు అంటే నాకు ఇష్టం. కానీ ఇప్పుడు తప్పుడు ఆడియో సృష్టించి నేను జూనియర్ ఎన్టీఆర్ను దూషిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అందులో అసలే నిజం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
ఆడియో కారణంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా బాధపడి ఉంటే, తన ప్రమేయం లేకపోయినప్పటికీ క్షమాపణ చెబుతున్నానని ప్రసాద్ తెలిపారు. తాను నారా, నందమూరి కుటుంబాలకు ఎప్పటికీ విధేయుడినేనని వెల్లడించారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని, పోలీసులు దర్యాప్తు చేసి నిజాలు బయటపెడతారని ఆయన చెప్పారు. ఈ ఆడియో నిజమా లేదా నకిలీదా అనేది పోలీసుల దర్యాప్తుతోనే తేలాల్సి ఉంది.
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘ఫంకీ’ ఈరోజు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాలెంటైన్ వీక్ను…
భారత క్రికెట్ చరిత్రలో తరచూ కొత్త ప్రతిభలు వెలుగులోకి వస్తుంటాయి. కానీ కొన్ని ప్రతిభలు మాత్రం తొలి అడుగులోనే అందరి…
టీవీ సీరియల్స్, రియాలిటీ షోస్, ముఖ్యంగా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన అమర్ దీప్ చౌదరి ఇప్పుడు…
యాక్షన్ చిత్రాలతో దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపు పొందిన అర్జున్ సర్జా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన స్వయంగా…