Bonda Uma: అవును అతను నా మనిషే.. సీఎం రాయి దాడి ఘటనపై బోండా కామెంట్స్!

Bonda Uma: విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి ఘటన జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఘటనలో భాగంగా వేముల సతీష్ వేముల దుర్గారావు అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకువెళ్లారు. అనంతరం వీరిని విచారించిన తర్వాత విడుదల చేశారు.

ఇలా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై రాయి దాడి ఘటన వెనుక బోండా ఉమా హస్తం ఉందని ప్రతి ఒక్కరు సందేహాలను వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ విషయం గురించి బోండా ఉమా ఓపెన్ అయ్యారు. అవును దుర్గారావు నా మనిషి అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వేముల దుర్గారావు నా మనిషేనని బోండా ఉమా తెలిపారు.తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి. మా పార్టీ ఆఫీసు పక్క రోడ్డులోనే ఉంటాడు. నిత్యం పార్టీ ఆఫీసు దగ్గరే కూర్చుంటాడు. అది వాస్తవం. రాయి వేశాడని పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి వేముల సతీశ్. వేముల సతీష్ దుర్గారావు ఇంటిపేర్లు ఒకటే అయినప్పటికీ వారిద్దరి మధ్య బంధుత్వం ఉందా లేదా అనే విషయం తనకు తెలియదని తెలిపారు.

రాయి దాడికి దుర్గారావుకు సంబంధం లేదు..

ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి పై రాయి దాడి ఘటనలో భాగంగా వేముల దుర్గారావుకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని బోండా ఉమా తెలియజేశారు. అయితే బోండా ఉమా దుర్గారావు తన మనిషి అని ఒప్పుకోవడంతో ఈ ఘటన వెనుక తన ప్రమేయం ఉందని పలువురు ఆ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటమి భయం కారణంగానే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, పోలీసులు ఈ విషయంలో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి తప్పనిసరిగా ఈ దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago