AP politics: ప్రజల కోసమే పవన్ త్యాగం చేశారు.. వైసీపీ ఓటమి ఖాయం: కేశినేని చిన్ని

AP politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనే పోటీ నెలకొంది. ఈసారి రెండు పార్టీల మధ్య బలమైనటువంటి పోటీ ఉన్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసిపికి ఓటమి భయం పట్టుకుందని ఈయన వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో అభివృద్ధి లేకపోవడమే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలు లేవని అలాగే ఏపీని మొత్తం అప్పుల కూబిలో ఉంచారని తెలిపారు.

వైసిపి ఎమ్మెల్యేలు ప్రజలలోకి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి కూడా ప్రస్తుతం లేదని కేసినేని చిన్ని తెలిపారు. ప్రజలందరూ మార్పుకు సిద్ధమయ్యారని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక విజయవాడలో అన్ని సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని చిన్ని తెలిపారు.

సీట్లను త్యాగం చేశారు..
విజయవాడ అభివృద్ధి మొత్తం టీడీపీ హయాంలోనే జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం 80శాతం పూర్తి చేసింది టీడీపీనే అన్నారు. అమరావతి రావాలి యువత బాగుపడాలి అని పిలుపునిచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈయన మాట్లాడారు. ఈయన పొత్తులో భాగంగా 21 సీట్లు మాత్రమే తీసుకున్నారంటూ చాలామంది విమర్శలు చేశారు అయితే ప్రజల కోసమే ఈయన సీట్లను త్యాగం చేశారంటూ చిన్ని చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago