ఎన్ని డ్రింక్స్ ఉన్నా.. టీకి ఉండే ప్రత్యేకతే వేరు.. ఉదయాన్ని ఓ కప్పు టీ కడుపులో పడనిదే ఏ పని మొదలు పెట్టని వారు చాలా మంది ఉంటారు. ఉదయం నుంచి మొదలుపెడితే.. సాయంత్రం దాకా పదుల సంఖ్యలో టీలను తాగే టీ వ్యసనపరుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. టీ లేనిదే ఏ ఆతిధ్యం కూడా మొదలుకాదందే అతిశయోక్తి కాదు..
ఇలాంటి టీకి కారణమైన టీ పొడికి ఎంత ధర ఉంటుంది. ఒక కిలోకు వందల్లో ఉంటుంది.. మరి ఎక్కువ డిమాండ్ ఉన్న టీ పొడి అయితే మహా అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది.. కానీ ఒక కిలో టీ పొడి పౌడర్ లక్ష రూపాయలు ఉందంటే ఎవరైనా నమ్ముతారా… నమ్మకపోతే టీ పొడి గురించి తెలుసుకోవాల్సింది.
టీ పౌడర్లలో అస్సాంలో పండే టీ పౌడర్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండే తేయాకు మంచి సువాసన, టేస్ట్ ఇస్తుందని చాలా మంది చెబుతుంటారు. కాగా ఇటీవల నాణ్యమైన తేయాకును అక్కడి యజమానులు వేలానికి పెట్టారు. దీంట్లో కిలో టీ పౌడర్ ఏకంగా లక్ష రూపాయలు పలికింది. సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ ’మనోహరి గోల్డ్ టీ పొడి‘ని రికార్డ్ ధర పెట్టి కొనుగోలు చేశారు.
ఏకంగా రూ.99,999ను వేలంలో పాడి ఈ తేయాకును దక్కించుకున్నారు. గతంలో కూడా ఒక కిలో ఈ టీపౌడర్ రూ. 75 వేలకు అమ్ముడైంది. టీ కాచేటప్పుడు గోల్డ్ రంగు రావడం మనోహరి గోల్డ్ టీ పొడి ప్రత్యేకత. అంతే కాకుండా ఈ టీ వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉండటం కూడా టీ పొడికి ఈ రేటు పలుకుతోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…