Chiranjeevi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ నటుడు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇటీవల భారత ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా చిరంజీవి ఎంతో అత్యుత్తమమైనటువంటి ఈ పురస్కారాన్ని అందుకోవడంతో అభిమానులు ఇతర సినీ సెలబ్రిటీలో ఈయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇకపోతే ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి చిరంజీవిని అభినందిస్తూ ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు.
భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి చిరంజీవికి శుభాకాంక్షలని తెలిపారు. అనంతరం ఈయన చిరంజీవితో మాత్రమే కాకుండా రామ్ చరణ్ తో కూడా కాసేపు ముచ్చటించారు. ఇక ఈయనతో పాటు ఉపముఖ్యమంత్రి స్పీకర్ ఇతర తెలంగాణ మంత్రులు కూడా హాజరయ్యారు.
చిరంజీవికి అభినందనలు..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ కన్నా ముందు పద్మవిభూషణ్ అందుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు . అక్కినేని పద్మ శ్రీ, పద్మభూషణ్ తో పాటు 2011లో కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది.
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…