Chiranjeevi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ నటుడు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇటీవల భారత ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా చిరంజీవి ఎంతో అత్యుత్తమమైనటువంటి ఈ పురస్కారాన్ని అందుకోవడంతో అభిమానులు ఇతర సినీ సెలబ్రిటీలో ఈయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి చిరంజీవిని అభినందిస్తూ ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు.
భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి చిరంజీవికి శుభాకాంక్షలని తెలిపారు. అనంతరం ఈయన చిరంజీవితో మాత్రమే కాకుండా రామ్ చరణ్ తో కూడా కాసేపు ముచ్చటించారు. ఇక ఈయనతో పాటు ఉపముఖ్యమంత్రి స్పీకర్ ఇతర తెలంగాణ మంత్రులు కూడా హాజరయ్యారు.
చిరంజీవికి అభినందనలు..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ కన్నా ముందు పద్మవిభూషణ్ అందుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు . అక్కినేని పద్మ శ్రీ, పద్మభూషణ్ తో పాటు 2011లో కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది.

































