కరోనా సమయంలో తీసుకోవాల్సిన అన్నీ జాగ్రత్తలతో బిగ్బాస్ సీజన్ 4 బుల్లితెరపైకి వచ్చింది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లను 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి, అందరికీ పరీక్షలు చేసి నెగెటివ్ అని తేలిన తర్వాతనే హౌస్ లోకి పంపించారు. కరోనా కారణంగా తక్కువ మంది సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఆ కొద్దిమంది కూడా కరోనా నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో అందరూ చక్కగా వినోదాన్నిఅందిస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కరోనా మహమ్మారి పంజా విసిరింది. ఈ షోలో పనిచేసే కొందరు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తాజా సమాచారం.
అంతేకాకుండా ఈ సీజన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణా ఫోక్ సింగర్ గంగవ్వ కూడా అస్వస్థతకు గురైనట్లు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ‘నేను ఇంటికి వెళ్లిపోతా.. నా మనవళ్లను, మనవరాళ్లను చూడాలని ఉంది’ అని గంగవ్వ అంటున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మాత్రం అందుకు ఒప్పుకోకుండా “నువ్వు ఇంట్లో ఉండాలన్నా, పోవాలన్నా డిసైడ్ చేసేది ప్రేక్షకులే.!” అని తేల్చి చెప్పేసారు. లేటెస్ట్ గా టెక్నీషియన్లకు కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా గంగవ్వకు కూడా కోవిడ్-19 పరీక్ష చేయించారట. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందంటున్నారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన షో నిర్వహకులు మరిన్ని కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతవరకూ జరిగిన షోలో గంగవ్వ వరుసగా రెండోసారి కూడా ఎలిమినేషన్ లిస్టులో ఉంది. కానీ, ప్రేక్షకులు ఆమెకు విపరీతంగా ఓట్లు వేస్తూ మద్దతునిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండలేనని మాటిమాటికీ చెప్తుండటంతో బిగ్బాస్ నిర్వాహకులే ఓ అడుగు ముందుకేసి ఆమెను త్వరలోనే బయటకు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…