సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసినా.. ఆ సినిమాలోని పాటలు అన్నీ బంపర్ హిట్ అవుతున్నాయి. అల వైకుంఠపురం సినిమాకు సంబంధించిన పాటలు యూట్యూబ్ లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయే అందరికీ తెలిసిందే.
అలా అతడు ప్రస్తుతం తన సంగీతంతోనే తన రికార్డులను తానే చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు.. సౌత్ లోనే అతడి హవా కొనసాగుతోంది. అయితే ఇంత మంచి సక్సెస్ అందుకుంటున్న తమన్ ఇటీవల విడుదలైన నాని టక్ జగదీష్ విషయంలో కాస్త బాధపడ్డాడట. అతడు ఆ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే నానికి నచ్చలేదు.. దీంతో గోపీసుందర్ ర్ తో చేయించుకున్నారని తెలిపారు.
ఇక తనకు బాలీవుడ్ కు ఉన్న సంబంధాన్ని గురించి తెలిపాడు. బాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా చేయడం వేరు.. సౌత్ లో సంగీతం అందించడం వేరు అని అన్నాడు. బాలీవుడ్ లో సంగీతం ఒక్కడే అందిచడం అనేది ఉండదని.. ఒక్క సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు కలిసి పని చేస్తారన్నారు. అంతే కాకుండా.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరొకకు ఇస్తారంటూ చెప్పాడు.
ఒకే సినిమాకు సంబంధించి మొత్తం సంగీతం అనేది ఒక్క దర్శకుడికి ఇస్తేనే బాగా చేయగలం.. ఇలా ఇద్దరు ముగ్గురికి ఇస్తే సంగీతం కంపోజ్ చేయడం తన వల్ల కాదు అని.. అందుకే బాలీవుడ్ నుంచి పారిపోయి సౌత్ కు వచ్చినట్లు చెప్పాడు. అతడు బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ గోల్ మాల్, రణ్ వీర్ సింగ్ సింబా సినిమాలకు పని చేశాను అంటూ తమన్ నాటి విషయాలను గుర్తు చేశాడు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…