హీరో నాని చేసిన ఆ పనికి తాను బాధపడ్డాను.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన తమన్..

సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసినా.. ఆ సినిమాలోని పాటలు అన్నీ బంపర్ హిట్ అవుతున్నాయి. అల వైకుంఠపురం సినిమాకు సంబంధించిన పాటలు యూట్యూబ్ లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయే అందరికీ తెలిసిందే.

అలా అతడు ప్రస్తుతం తన సంగీతంతోనే తన రికార్డులను తానే చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు.. సౌత్ లోనే అతడి హవా కొనసాగుతోంది. అయితే ఇంత మంచి సక్సెస్ అందుకుంటున్న తమన్ ఇటీవల విడుదలైన నాని టక్ జగదీష్ విషయంలో కాస్త బాధపడ్డాడట. అతడు ఆ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే నానికి నచ్చలేదు.. దీంతో గోపీసుందర్ ర్ తో చేయించుకున్నారని తెలిపారు.

ఇక తనకు బాలీవుడ్ కు ఉన్న సంబంధాన్ని గురించి తెలిపాడు. బాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా చేయడం వేరు.. సౌత్ లో సంగీతం అందించడం వేరు అని అన్నాడు. బాలీవుడ్ లో సంగీతం ఒక్కడే అందిచడం అనేది ఉండదని.. ఒక్క సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు కలిసి పని చేస్తారన్నారు. అంతే కాకుండా.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరొకకు ఇస్తారంటూ చెప్పాడు.

ఒకే సినిమాకు సంబంధించి మొత్తం సంగీతం అనేది ఒక్క దర్శకుడికి ఇస్తేనే బాగా చేయగలం.. ఇలా ఇద్దరు ముగ్గురికి ఇస్తే సంగీతం కంపోజ్ చేయడం తన వల్ల కాదు అని.. అందుకే బాలీవుడ్ నుంచి పారిపోయి సౌత్ కు వచ్చినట్లు చెప్పాడు. అతడు బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ గోల్ మాల్, రణ్ వీర్ సింగ్ సింబా సినిమాలకు పని చేశాను అంటూ తమన్ నాటి విషయాలను గుర్తు చేశాడు.