Thammareddy Bhardwaja : ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్బంగా తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రస్తుత తెలుగు సినిమా పోకడల గురించి విమర్శించారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలు వాటిలో ఉపయోగిస్తున్న భాష, ఇక పాటల్లో పదాల ఉచ్చరణ వంటివి తెలుగు భాషను నాశనం చేస్తున్నాయి అంటూ విమర్శించారు. ఇక హీరోలకే సరిగా తెలుగు రాదు ఇక మిగిలిన ఆర్టిస్ట్ల సంగతి చెప్పక్కర్లేదు. మన తెలుగు సినిమాల్లో మన వాళ్ళ కంటే పక్క భాషల వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక వారికీ భాష రాదు, పోనీ వాళ్లకు డబ్బింగ్ చెప్పే వాళ్లకన్నా భాష వస్తుందా అంటే అదీ లేదు. ఇక తెలుగుకి తెగులు పట్టిస్తారు ఇలాంటి వాళ్ళు అంటూ ఆయన వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
చిరు, బాలయ్య ను చూసి నేర్చుకోండి… ఎన్టీఆర్ తప్ప ఇప్పటి హీరోలకు తెలుగు రాదు…
ప్రస్తుతం ఉన్న హీరోల్లో చాలా మందికి తెలుగు మాట్లాడటం స్పష్టంగా రాదు. ఇక రాయడం అసలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్ మాత్రమే తెలుగు చక్కగా మాట్లాడుతాడు మిగిలిన వాళ్లకు తెలుగు సరిగా మాట్లాడటమే రాదు. ఇక వారికి డైలాగులు తెలుగులో చెప్పడం ఇంకేం సరిగా వస్తుంది. పోనీ దర్శకులు తప్పులను సరి చేస్తారా అంటే వాళ్ళ పరిస్థితీ అంతే, చాలా మంది కుర్ర దర్శకులకు తెలుగు భాష పై పట్టు ఉండటం లేదు. ఈ మధ్య వచ్చిన ‘లైగర్’ సినిమాలో ‘వాట్ లాగా దేంగే’ అంటూ ఆ డైలాగులు ఏమిటి.. రాసినవాడికైనా బుద్ధుండాలి కదా. పాన్ ఇండియా మోజులో పడి భాష ను కిచిడి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు భరద్వాజ గారు.
పాన్ ఇండియా సినిమా అంటూ పర భాష నటులను పెట్టుకోవడం ఒకటైతే ఇక దాంట్లో భాషను నాశనం చేస్తున్నారు. అన్ని భాషల్లో విడుదల చేయాలంటే దానికి తెలుగును చంపడం ఎందుకు ఏ భాషలో విడుదల చేస్తున్నారో అక్కడ ఆ భాష వాడితే సరిపోతుంది. అన్ని భాషలు తెలుగులో వాడాలా, అయినా పాన్ ఇండియా సినిమాను ఇప్పుడేదో కొత్తగా కనుగొన్నట్టు చేస్తున్నారు. ఎపుడో భానుమతి గారు మూడు భాషలలో ‘చండి రాని’ అనే సినిమాను ఏ భాషకు సంబంధిచిన నటులతో అక్కడ షూటింగ్ చేసి కేవలం 35 రోజుల్లో సినిమా తీశారు, మూడు భాషల్లోనూ అది పాన్ ఇండియా చిత్రమే. ఇపుడు పాన్ ఇండియా పేరుతో అన్ని భాషలనూ కిచిడి చేసి ఆ సినిమాను సంవత్సరాలు తీస్తారు, ఏదో గొప్ప విషయం అన్నట్టు చెబుతారు అంటూ మండిపడ్డారు. చిరంజీవి, బాలకృష్ణ ను ఈ తరం నటులు ఆదర్శంగా తీసుకుంటే కొన ఊపిరి తో ఉన్న తెలుగు భాష కనీసం బ్రతుకుతుంది అంటూ అభిప్రాయపడ్డారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…