Featured

Thammareddy Bharadwaja : ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్ తప్ప ఎవరికీ సరిగా తెలుగు రాదు… ‘వాట్ లగా దేంగే’ అంటూ పిచ్చి డైలాగులు రాసే వాడికి బుద్ధుండాలి : తమ్మారెడ్డి

Thammareddy Bhardwaja : ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్బంగా తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రస్తుత తెలుగు సినిమా పోకడల గురించి విమర్శించారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలు వాటిలో ఉపయోగిస్తున్న భాష, ఇక పాటల్లో పదాల ఉచ్చరణ వంటివి తెలుగు భాషను నాశనం చేస్తున్నాయి అంటూ విమర్శించారు. ఇక హీరోలకే సరిగా తెలుగు రాదు ఇక మిగిలిన ఆర్టిస్ట్ల సంగతి చెప్పక్కర్లేదు. మన తెలుగు సినిమాల్లో మన వాళ్ళ కంటే పక్క భాషల వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక వారికీ భాష రాదు, పోనీ వాళ్లకు డబ్బింగ్ చెప్పే వాళ్లకన్నా భాష వస్తుందా అంటే అదీ లేదు. ఇక తెలుగుకి తెగులు పట్టిస్తారు ఇలాంటి వాళ్ళు అంటూ ఆయన వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

చిరు, బాలయ్య ను చూసి నేర్చుకోండి… ఎన్టీఆర్ తప్ప ఇప్పటి హీరోలకు తెలుగు రాదు…

ప్రస్తుతం ఉన్న హీరోల్లో చాలా మందికి తెలుగు మాట్లాడటం స్పష్టంగా రాదు. ఇక రాయడం అసలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్ మాత్రమే తెలుగు చక్కగా మాట్లాడుతాడు మిగిలిన వాళ్లకు తెలుగు సరిగా మాట్లాడటమే రాదు. ఇక వారికి డైలాగులు తెలుగులో చెప్పడం ఇంకేం సరిగా వస్తుంది. పోనీ దర్శకులు తప్పులను సరి చేస్తారా అంటే వాళ్ళ పరిస్థితీ అంతే, చాలా మంది కుర్ర దర్శకులకు తెలుగు భాష పై పట్టు ఉండటం లేదు. ఈ మధ్య వచ్చిన ‘లైగర్’ సినిమాలో ‘వాట్ లాగా దేంగే’ అంటూ ఆ డైలాగులు ఏమిటి.. రాసినవాడికైనా బుద్ధుండాలి కదా. పాన్ ఇండియా మోజులో పడి భాష ను కిచిడి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు భరద్వాజ గారు.

పాన్ ఇండియా సినిమా అంటూ పర భాష నటులను పెట్టుకోవడం ఒకటైతే ఇక దాంట్లో భాషను నాశనం చేస్తున్నారు. అన్ని భాషల్లో విడుదల చేయాలంటే దానికి తెలుగును చంపడం ఎందుకు ఏ భాషలో విడుదల చేస్తున్నారో అక్కడ ఆ భాష వాడితే సరిపోతుంది. అన్ని భాషలు తెలుగులో వాడాలా, అయినా పాన్ ఇండియా సినిమాను ఇప్పుడేదో కొత్తగా కనుగొన్నట్టు చేస్తున్నారు. ఎపుడో భానుమతి గారు మూడు భాషలలో ‘చండి రాని’ అనే సినిమాను ఏ భాషకు సంబంధిచిన నటులతో అక్కడ షూటింగ్ చేసి కేవలం 35 రోజుల్లో సినిమా తీశారు, మూడు భాషల్లోనూ అది పాన్ ఇండియా చిత్రమే. ఇపుడు పాన్ ఇండియా పేరుతో అన్ని భాషలనూ కిచిడి చేసి ఆ సినిమాను సంవత్సరాలు తీస్తారు, ఏదో గొప్ప విషయం అన్నట్టు చెబుతారు అంటూ మండిపడ్డారు. చిరంజీవి, బాలకృష్ణ ను ఈ తరం నటులు ఆదర్శంగా తీసుకుంటే కొన ఊపిరి తో ఉన్న తెలుగు భాష కనీసం బ్రతుకుతుంది అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

52 minutes ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

60 minutes ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

1 hour ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

3 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

3 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

3 hours ago