Thammareddy Bharadwaja: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి ది అలుపెరుగని ప్రస్థానం . ఎవరి అండ దండాలు లేకుండా ఒంటరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి స్థానం ఇప్పటికీ పదిలంగానే ఉంది. మధ్యలో కొంతకాలం రాజకీయాలలో ప్రవేశించి సినిమాలకు దూరమైనప్పటికీ.. మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా నిరూపించుకున్నాడు.
ఇక అప్పటినుండి వరస సినిమాలలో నటిస్తూ నేటి యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన సినిమాలలో మరొక హీరో ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ విషయం గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియాలో చిరు మార్కెట్ తగ్గిపోయిందని వస్తున్న వార్తలలో నిజం లేదని.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆయన మార్కెట్ ఆయనకు సపరేట్గా ఉంటుందని వెల్లడించాడు.
చిరంజీవిగారిని ఎవరో వచ్చి జాకీ పెట్టి లేపాల్సినంత అవసరం లేదని.. ఆయన ఫాలోయింగ్, రెవెన్యూ ఆయనకు ఉన్నాయని తమ్మారెడ్డి వెల్లడించాడు. ఇక ఈ సందర్భంగా నాగబాబు గురించి మాట్లాడుతూ సంచలనం వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న నాగబాబు చిరంజీవికి రెడ్ కార్పెట్ పరిచి ఆ తర్వాత చిరంజీవి గురించి తక్కువగా మాట్లాడారని చెప్పుకొచ్చాడు.
ఇక నాగబాబు చేసిన వ్యాఖ్యల గురించి తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ… చిరంజీవి గారిని ఎవరు తక్కువ చేసి మాట్లాడారని నాగబాబు వారు అన్నారు.. కానీ చిరంజీవి అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరని.. మనం అలాంటి విషయాలను పట్టించుకుంటే ఎదుటివారి స్థాయిని పెంచి చిరు స్థాయి తగ్గించినట్లు అవుతుందని తమ్మారెడ్డి వెల్లడించాడు. అందువల్ల నాగబాబు గారు అలాంటి విషయాలను మాట్లాడకపోతే చిరంజీవి గారి గౌరవం ఇంకా పెరుగుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…