Unstoppable: ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న “అన్ స్టాపబుల్ “రియాలిటీ షో మంచి రేటింగ్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోలో ఎంతోమంది సెలబ్రిటీలు గెస్ట్లుగా పాల్గొని సందడి చేస్తున్నారు. దీంతో ఈ రియాలిటీ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
గత కొద్ది రోజులుగా అన్ స్టాపబుల్ రియాలిటీ షో కి సంబంధించిన ప్రోమోలు, ఎపిసోడ్ లు అనధికారికంగా సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ విషయం గురించి ఇప్పటికే ఆహా సంస్థ ఇలా అనధికారిక ప్రసారాలను నిలిపివేయాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇటీవల ఇలాంటి అనధికారిక ప్రసారాలకు అడ్డుకట్ట వేయటానికి అర్హ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
అన్ స్టాపబుల్ షో ని నియమాలకు విరుద్ధంగా అనధికారికంగా ప్రసారం చేయటం వల్ల షోపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. ప్రభాస్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ డిసెంబర్ 30 వ తేదీన ప్రసారం కానుండటంతో ఆ ఎపిసోడ్ తో పాటు మిగిలిన ఎపిసోడ్లను కూడా అనధికారికంగా ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టుని ఆశ్రయించారు. అనధికారిక ప్రసారాల వల్ల షో నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారని.. అందువల్ల వాటిని అరికట్టటానికి మీడియా మాధ్యమాలపై చర్యలు తీసుకునేలా ‘ డైనమిక్ ఇంజక్షన్’ మంజూరు చేయాలని కోర్టుని కోరారు.
ఈ విషయంపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ సెర్చ్ దేవ్ తాజాగా కీలక ఆదేశాలను జారీ చేశారు. అన్ స్టాపబుల్ షో అనధికారిక ప్రసారాలపై కోర్టు తీర్పునిస్తూ తదుపరి విచారణ వరకు ‘ మధ్యంతర ఇంజక్షన్ ‘ ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ స్టాపబుల్ షో కి సంబంధించి సామాజిక మాధ్యమాలలో ఉన్న లింకులను వెంటనే తొలగించాలని టెలి కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ తో పాటు ఇంటర్నెట్ ప్రొవైడర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…