Thammareddy Bharadwaja : సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ సినిమా షూటింగుల బంద్. దీని వల్ల నిర్మాతల సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో కానీ కార్మికులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కొంతమంది నిర్మాతలు వారి స్వప్రయోజనాల కోసం ఈ బంద్ కి పూనుకున్నారని కొంతమంది సీనియర్ నిర్మాతలు అభిప్రాయ పడుతున్నారు. ఇక హీరోలు తమ రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాలి అంటూ నిర్మాతల గిల్డ్ చేస్తున్న డిమాండ్ ను కూడా తప్పు బడుతున్నారు. ఇక ఈ అంశాల మీద ఇప్పటికే అశ్విని దత్, నట్టి కుమార్ వంటి వాడు స్పందించారు. ఇక ఇపుడు సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు.
కోటి రూపాయల హీరోకి నలభై కోట్లు ఇవ్వడమెందుకు…
హీరో రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుతూ తమ్మారెడ్డి గారు ప్రస్తుత నిర్మాతల మీద ఘాటు వాఖ్యలు చేసారు. పది మంది ప్రొడక్షన్ హౌస్ లు పెట్టుకుని సినిమాలు తీస్తూ ఎక్కువ రెమ్యూనరేషన్లల్ని ఒక ఇద్దరు హీరోలకి ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారు కదా. నువ్వు ఇవ్వను అంటే హీరోలు డిమాండ్ చేయరు. నువ్వు ఇవ్వడం అలవాటు చేసుకుని వాళ్లను మీద నిందలేస్తే ఎలా. ఒక హీరోకి ఎన్ని కోట్లు ఇస్తే ఇంకో హీరో ఖచ్చితంగా డిమాండ్ చేస్తాడు. పది కోట్లు తీసుకునే హీరో నువ్వు పక్క హీరోకి నలభై కోట్లు ఇస్తున్నావని ఖచ్చితంగా నలభై కోట్లు అడుగుతాడు. ఒక రోజుకే ఆ హీరో డిమాండ్ పది నుండి నలభై కి పోతుంది. నాకు వంద కోట్ల మార్కెట్ ఉంది నాకు ఇవ్వు నలభై కోట్లు అంటారు. సినిమాలను పాన్ ఇండియా అనే పిచ్చి లో పడి తెలుగు నేటివిటీ మర్చి పోయి తీస్తూ బడ్జెట్ పెంచుకుంటూ పోతే నష్టం భరించాల్సి వస్తుంది. ఒక ఆచార్య విషయంలోనే కాదు చాలా సినిమాల విషయంలో ఇలాగే జరిగితోంది. ప్రొడక్షన్ కాస్ట్ అదుపులో పెట్టుకుంటే ఇన్ని సమస్యలు రావు కదా. హిందీ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాలో కోర్ట్ సన్నివేశం మూడు రోజుల్లో చిత్రికరిస్తే ఇక్కడ తెలుగులో పది రోజులపైనే కేవలం కోర్ట్ సీన్ తీశారు. సినిమాకు పదికోట్లు ఖర్చు పెడితే ఇక్కడ యాభై కోట్లకు పైనే ఖర్చుపెట్టారు.
ఇక అది వందకోట్లు వసూలు చేయాలని అనుకుంటే ఎలా.. భీమ్లా నాయక్ సినిమా మలయాళం లో నాలుగు కోట్ల సినిమా, కానీ ఇక్కడ బడ్జెట్ యాభై కోట్ల పై మాటే అలాప్రొడక్షన్ కాస్ట్ పెంచుకుంటూ పోతే బడ్జెట్ పెరగక ఏమవుతుంది. మళ్ళీ టికెట్ రేట్లు పెంచాలి అంటూ మాట్లాడారు. రేట్లు పెంచితే జనం సినిమా కోసం థియేటర్లకే రావడం లేదు. ఆ సినిమాలో ఎంత పెద్ద హీరో ఉన్నా చూడడానికి ఆసక్తి చూపడం లేదు. ఓటీటీ లో వచ్చాక చూద్దాంలే అనే అభిప్రయానికి వచ్చారు. కాబట్టి సమస్యకు పరిష్కారం సినిమా షూటింగులను ఆపేయడం కాదు, హీరోల రెమ్యూనరేషన్లు కాదు అంటూ ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు తమ్మారెడ్డి.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…