Political News

వైసీపీ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్.. మంత్రి నిమ్మల రామానాయుడు!

అమరావతి: వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అబద్ధాలు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ సృష్టించిన భూతం చివరికి వారినే మింగేస్తుందని, సీసాలో బిరడా బిగించి మూతపెట్టినట్టే వారి పరిస్థితి ఉంటుందని ఎద్దేవా చేశారు.

జగన్ పై విమర్శలు..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంభీరమైన మాటలు మాత్రమే చెబుతారని, వాటిని చేతల్లో చూపించరని మంత్రి వ్యాఖ్యానించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారన్న నమ్మకం తమకు లేదని నిమ్మల పేర్కొన్నారు.

స్టీల్ ప్లాంట్ పై వివరణ..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంపై మంత్రి నిమ్మల మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణకు ప్రయత్నించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొసలి కన్నీరు కార్చడం వైసీపీకి అలవాటని దుయ్యబట్టారు. గతంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ తీసుకువచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నారని గుర్తు చేశారు. అయితే, వైసీపీ పాలనలో ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరిగినప్పుడు వారి ఎంపీలు, నాయకులు నోరు మెదపలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు రూ.11 వేల కోట్ల నిధులను తెచ్చి స్టీల్ ప్లాంట్‌ను కాపాడారని నిమ్మల స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో విద్యా రంగం నాశనం: మంత్రి నిమ్మల

అమరావతి: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, విద్యా రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అడ్డగోలు సిఫార్సులు, బదిలీల పేరుతో దాదాపు రూ.50 కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు.

టీచర్ల పట్ల నిర్లక్ష్యం..

టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారని, గురువులను గౌరవించాల్సిన బదులు వారిని వైన్ షాపుల వద్ద కాపలా పెట్టారని నిమ్మల విమర్శించారు. మరుగుదొడ్లను కడిగించారంటూ తీవ్రంగా ఖండించారు.

మెగా డీఎస్సీ ప్రకటన..

డీఎస్సీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే డీఎస్సీ అని నిమ్మల అన్నారు. దేశంలో రికార్డు స్థాయిలో రెండు లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేస్తోందని చెప్పారు.

ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత..

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన షూలు, యూనిఫారాలు, బ్యాగులు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంలో సన్నరకం బియ్యం అందించడంతో పాటు, విద్యా ప్రమాణాలను పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago