బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో ప్రారంభమైన మూడు రోజుల్లోనే చర్చలు, వాదోపవాదాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ సక్సెస్ అయ్యిందా, ఫెయిల్ అయ్యిందా అన్నది పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ఈ షోపై డిస్కషన్ మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఈసారి అసలు షోకు ముందే “అగ్నిపరీక్ష” పేరుతో ప్రత్యేక ప్రోగ్రామ్ను ప్రారంభించడం బిగ్ బాస్ మేకర్స్ ప్లాన్.
ఈసారి కామన్ మ్యాన్కి కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ఛాన్స్ ఇచ్చారు. అందుకోసం అప్లికేషన్స్ తీసుకుని, మొదట 45 మందిని షార్ట్లిస్ట్ చేశారు. ఆ తరువాత ఆ లిస్ట్ నుంచి 15 మందిని ఫైనల్ చేశారు. ఈ ఎంపికలో కొన్ని నిర్ణయాలను జడ్జిలపై ప్రశ్నించేలా సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం మొదలైంది.
అగ్నిపరీక్ష షోలో జడ్జీలుగా సీజన్ 1లో టాప్ 3గా నిలిచిన నవదీప్, సీజన్ 4 విన్నర్ అభిజిత్, బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ సీజన్ విన్నర్ బిందు మాధవిని తీసుకున్నారు. హోస్ట్గా శ్రీముఖి వ్యవహరిస్తోంది. ఆమె బిగ్ బాస్ సీజన్ 3లో రన్నరప్గా నిలిచింది.
ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్లో “డేర్ ఆర్ డై” అనే రౌండ్ జరిగింది. ఇందులో షకీబ్, కల్కి పోటీ పడ్డారు. ఈ టాస్క్లో వారికి తెలిసినవారికి ఫోన్ చేసి, డబ్బు తమ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సి వచ్చింది. కల్కి రూ.90 వేల వరకు సక్సెస్ కాగా, షకీబ్ రూ.60 వేల వరకు మాత్రమే తెచ్చుకోగలిగాడు.
ఇక్కడ హోస్ట్ శ్రీముఖి కల్కి అమౌంట్ను డీటైల్గా చెప్పినా, షకీబ్కి అంత స్పష్టంగా చెప్పలేదని కమెంట్స్ వచ్చాయి. దీంతో షకీబ్ కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ సమయంలో నవదీప్ షకీబ్ను అడిగి “అన్ఫెయిర్ అనిపించిందా?” అని ప్రశ్నించాడు. షకీబ్ మాత్రం “కన్ఫ్యూజ్” అయ్యానని చెప్పి వెళ్లిపోయాడు.
అయితే మరో కంటెస్టెంట్ శ్రీజ మాత్రం దీనిపై నేరుగా “అన్ఫెయిర్” అని వ్యాఖ్యానించింది. దీనిపై నవదీప్ ఆమెను కొంత ఆపడానికి ప్రయత్నించాడు. ఈ రియాక్షన్ చూసి సోషల్ మీడియాలో కొందరు “నవదీప్ ఎప్పుడూ కూల్గా ఉండే వ్యక్తి.. కానీ ఈసారి ఓవర్గా రియాక్ట్ అయ్యాడు” అని కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తం మీద, కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్తో జడ్జీలు, హోస్ట్ వ్యవహరిస్తున్న తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. “కంటెస్టెంట్ కామన్ అయినా కూడా వారికి రిస్పెక్ట్ ఇవ్వాలి” అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…