Elon Musk: అంగారక గ్రహంపై మానవుడు కాలు మోపేది ఆ రోజే..ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Elon Musk: రానున్న రోజుల్లో అంగారక గ్రహానికి మానవులను పంపించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇది ఎప్పుడనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే మార్స్ గ్రహంపైకి నాసా, యూరోపియన్ యూనియన్, చైనా స్పెస్ ఎజెన్సీలు, ఇస్రో వంటివి ఇప్పటికే శాటిలైట్లను పంపించాయి.
నాసా వంటివి రోవర్లను కూడా పంపింది. గతంలో క్యూరియాసిటీ రోవర్ ను పంపించింది. ఇటీవలనే నాసా పర్సువరెన్స్ రోవర్ ను మార్స్ పైకి విజయవంతంగా పంపించింది. అయితే తాజాగా ఎలాన్ మస్క్.. తన స్పెస్ ఎక్స్ సంస్థ నుంచి వచ్చే 5 ఏళ్లలో మార్స్ పైకి తప్పకుండా.. మనిషిని పంపిస్తామని అన్నారు.
‘‘రాబోయే ఐదేళ్లలో తప్పకుండా మనిషిని మార్స్ పైకి పంపిస్తాం. ఎదైనా వరెస్ట్ సినారియో ఎదురైతే పదేళ్లు పట్టొచ్చు. ఈ పదేళ్లలో మనిషిని మార్స్ పైకి పంపించడం ఖాయమని.. అందుకు నాది బాధ్యత’’ అని ఎలాన్ మస్క్ అన్నారు. పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు మస్క్.
ఇప్పటికే స్పెస్ ఎక్స్ రాకెట్ల ద్వారా హెవీ పెలోడ్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాడు. డ్రాగన్ క్రూ ద్వారా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటికే నాసాకు సంబంధించిన శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశ పెట్టాడు. ప్రస్తుతం స్టార్ షిప్ లాంటి హెవీ వెహికిల్ ను సిద్దం చేస్తున్నాడు. స్పెస్ ఎక్స్ సంస్థ రాకెట్లకు ఉపయోగించే బూస్టర్లను తిరిగి వినియోగించేలా మళ్లీ నెలపైకి వచ్చేలా.. రూపొందించారు. టెస్లా సంస్థ ద్వారా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాడు ఎలాన్ మస్క్.
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…