Central Minister: ఆ సమయంలో కూడా వాళ్లు పని చేశారు..!మహిళల సేవలను కొనియాడిన కేంద్రమంత్రి..
Central Minister: దేశంలో మహిళలు మగవారికి తామేమి తక్కువ కాదన్నట్లు.. ప్రతీ రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఇటు రాజకీయాల్లో అయినా.. అటు ఐటీ సెక్టార్లో అయినా. అయితే గత కొన్ని సంత్సరాల నుంచి మహిళలు ప్రతీ చోట తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు.
మున్సిపాలిటీ పని నుంచి ఫ్యాక్టరీలో పని చేసే గుమస్తా వరకు వాళ్లు పనులు చేస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మహిళలను ఉద్దేశించి ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టారు. దాని సారాంశం ఏంటంటే.. దేశంలోని చమురు, గ్యాస్ ఇన్స్టాలేషన్లలో పనిచేసే మహిళల సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది అంటూ ప్రశంసించాడు.
ఆఫ్షోర్ ప్లాట్ఫారమ్లలో పనిచేసే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ మహిళా ఉద్యోగుల చిత్రాలను ఆయన తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఈ మహిళలు 60 నుండి 70 రోజుల పాటు డ్రిల్లింగ్ ప్లాట్ఫారమ్లపైనే ఉన్నారని మంత్రి తెలియజేశాడు.
దేశ పురోగతిలో వారిని “సమాన భాగస్వాములు” అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో అభివర్ణించాడు. ఈ మేరకు నెట్టింట్లో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా మహిళలను ప్రోత్సహించే నిమిత్తం మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. ఇక వాళ్ల పనితనానికి మెచ్చి నెటిజన్లు కూడా సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మహిళలు ప్రతీ రంగంలో రాణిస్తున్నారని.. ప్రతీ ఒక్కరూ మహిళలను గౌరవించాలని కొంతమంది మహిళపై వాళ్లకు ఉన్న గౌరవాన్ని తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…