Aham Brahmasmi: అహం బ్రహ్మాస్మి సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్..కారణం అదేనా?
Aham Brahmasmi: మంచు మోహన్ బాబు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో పలు విలక్షణ పాత్రలో నటించిన నటుడు మంచు మనోజ్ అనంతరం హీరోగా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఈ క్రమంలోనే ఈయన గత కొంత కాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
మంచు మనోజ్ ఇకపై సినిమాలకు దూరమవుతూ పలు వ్యాపారాలను చూసుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సమయంలో ఆ వార్తలను కొట్టి పారేసి ఈయనఅహం బ్రహ్మాస్మి అనే ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేశారు.ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అయితే ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమాను దాదాపు అందరు మరిచిపోయారు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా కోసం మనోజ్ కాస్త బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు రావడంతో తిరిగి ఈ సినిమా పట్టాలెక్కుతోందని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం మనోజ్ ఈ సినిమాపై ఏమాత్రం ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందో లేదో తెలియని పక్షంలో దర్శకుడు ఈ సినిమా కోసం తాను ఎదురు చూడలేనని అందుకే ఈ సినిమాకి గుడ్ బై చెబుతూ మరొక హీరోతో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నారట.
ఈ క్రమంలోనే దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో మరో ప్రాజెక్టు మొదలు పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియో విడుదల చేయడంతో ఆ వీడియోలో డైలాగ్స్ వింటుంటే ‘అహం బ్రహ్మాస్మి’ ప్రాజెక్ట్ నే డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మెగా హీరోతో చేస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…