No Entry: పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం..మూడు రోజులుగా ఆ విద్యార్థినుల పరిస్థితి..?
No Entry: పాఠశాల ఆవరణలో హిజాబ్ ధరించినందుకు విద్యార్థినులను తరగతి గదిలోకి రానీయకుండా చేసి బయట నిలబెట్టారు పాఠశాల ప్రిన్సిపాల్ . ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి నగరంలో ప్రభుత్వ మహిళా పీయూ యూనివర్సిటీ కళాశాలలో చోటుచేసుకుంది.
ప్రథమ, ద్వితీయ పీయూలకు చెందిన ఆరుగురు విద్యార్థులు హిజాబ్ ధరించి మూడు రోజులుగా కళాశాలలో రిపోర్టు చేస్తున్నారని.. అందుకు ప్రిన్సిపల్ రుద్ర గౌడ వారిని తరగతి గదుల్లోకి రానివ్వడం లేదని ఆరోపించారు. తమ మతపరమైన హక్కును గౌరవించాలని .. హిజాబ్తో తరగతులకు అనుమతించాలని బాలికల తరఫున విద్యార్థులు ప్రిన్సిపాల్ను కోరుతున్నారు.
విద్యాసంస్థ నిబంధనల ప్రకారం విద్యార్థినులు హిజాబ్ ధరించకుండా కళాశాలకు వస్తేనే అనుమతిస్తామని ప్రిన్సిపాల్ హుకూం జారీ చేశాడు. ఈ ఘటనను క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఖండించింది. అయితే కళాశాల అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు యశ్పాల్ సువర్ణ మాట్లాడుతూ.. తాము ప్రిన్సిపాల్ వెంటే ఉన్నామని.. కళాశాల విద్యా వాతావరణాన్ని పాడుచేయనివ్వబోమని అన్నారు.
కాలేజీ ప్రిన్సిపాల్ రుద్ర గౌడ ఈ విషయాలను స్పష్టం చేస్తూ.. ”ఇప్పటి వరకు ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించాలనే నిబంధన కాలేజీలో లేదు. అయితే, గత మూడు రోజుల నుండి.. మొత్తం 60 మంది ముస్లిం బాలికలలో ఆరుగురు విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తున్నారు. కాబట్టి మేము వారిని తరగతులకు అనుమతించలేదు. వారు హిజాబ్ను తొలగిస్తే తరగతులకు హాజరు కావచ్చు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమస్యపై చర్చించాం. వారు ఈ నియమాన్ని అర్థం చేసుకున్నారు.. అంతే కాదు వాళ్లు ఈ నిబంధనను అంగీకరించారని తెలిపాడు. కానీ ఈ విషయంపై ఆ బాలికల తల్లిదండ్రులు తాము ప్రిన్సిపాల్ తో ఈ విషయంపై మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. వారు ఈ విషయాన్ని స్థానికి మీడియాతో వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. క్లాస్ లోకి తమ పిల్లలను మూడు రోజులుగా అనుమంతించకపోవడంతో.. అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందని.. దయచేసి వాళ్లను అనుమతివ్వండి అంటూ వేడుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…