General News

No Entry: పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం..మూడు రోజులుగా ఆ విద్యార్థినుల పరిస్థితి..?

No Entry: పాఠశాల ఆవరణలో హిజాబ్ ధరించినందుకు విద్యార్థినులను తరగతి గదిలోకి రానీయకుండా చేసి బయట నిలబెట్టారు పాఠశాల ప్రిన్సిపాల్ . ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి నగరంలో ప్రభుత్వ మహిళా పీయూ యూనివర్సిటీ కళాశాలలో చోటుచేసుకుంది.

No Entry: పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం..మూడు రోజులుగా ఆ విద్యార్థినుల పరిస్థితి..?

ప్రథమ, ద్వితీయ పీయూలకు చెందిన ఆరుగురు విద్యార్థులు హిజాబ్‌ ధరించి మూడు రోజులుగా కళాశాలలో రిపోర్టు చేస్తున్నారని.. అందుకు ప్రిన్సిపల్‌ రుద్ర గౌడ వారిని తరగతి గదుల్లోకి రానివ్వడం లేదని ఆరోపించారు. తమ మతపరమైన హక్కును గౌరవించాలని .. హిజాబ్‌తో తరగతులకు అనుమతించాలని బాలికల తరఫున విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను కోరుతున్నారు.

No Entry: పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం..మూడు రోజులుగా ఆ విద్యార్థినుల పరిస్థితి..?

విద్యాసంస్థ నిబంధనల ప్రకారం విద్యార్థినులు హిజాబ్ ధరించకుండా కళాశాలకు వస్తేనే అనుమతిస్తామని ప్రిన్సిపాల్ హుకూం జారీ చేశాడు. ఈ ఘటనను క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఖండించింది. అయితే కళాశాల అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు యశ్‌పాల్‌ సువర్ణ మాట్లాడుతూ.. తాము ప్రిన్సిపాల్‌ వెంటే ఉన్నామని.. కళాశాల విద్యా వాతావరణాన్ని పాడుచేయనివ్వబోమని అన్నారు.

అటెండెన్స్ తగ్గే అవకాశం ఉంది.. అనుమతివ్వండి..

కాలేజీ ప్రిన్సిపాల్ రుద్ర గౌడ ఈ విషయాలను స్పష్టం చేస్తూ.. ”ఇప్పటి వరకు ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించాలనే నిబంధన కాలేజీలో లేదు. అయితే, గత మూడు రోజుల నుండి.. మొత్తం 60 మంది ముస్లిం బాలికలలో ఆరుగురు విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తున్నారు. కాబట్టి మేము వారిని తరగతులకు అనుమతించలేదు. వారు హిజాబ్‌ను తొలగిస్తే తరగతులకు హాజరు కావచ్చు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమస్యపై చర్చించాం. వారు ఈ నియమాన్ని అర్థం చేసుకున్నారు.. అంతే కాదు వాళ్లు ఈ నిబంధనను అంగీకరించారని తెలిపాడు. కానీ ఈ విషయంపై ఆ బాలికల తల్లిదండ్రులు తాము ప్రిన్సిపాల్ తో ఈ విషయంపై మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. వారు ఈ విషయాన్ని స్థానికి మీడియాతో వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. క్లాస్ లోకి తమ పిల్లలను మూడు రోజులుగా అనుమంతించకపోవడంతో.. అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందని.. దయచేసి వాళ్లను అనుమతివ్వండి అంటూ వేడుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

6 seconds ago

అమావాస్య వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుంటే ఆశ్చర్యమే!

ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…

9 minutes ago

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

39 minutes ago

ఎవరీ నటాలీ బేకర్?.. అమెరికా-ఇరాన్ చర్చలతో ట్రెండ్‌లోకి

ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…

42 minutes ago

సచిన్‌తో హీరోయిన్ ప్రేమాయణం?.. అసలు నిజం బయటపెట్టిన నటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

1 hour ago

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

1 hour ago