General News

No Entry: పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం..మూడు రోజులుగా ఆ విద్యార్థినుల పరిస్థితి..?

No Entry: పాఠశాల ఆవరణలో హిజాబ్ ధరించినందుకు విద్యార్థినులను తరగతి గదిలోకి రానీయకుండా చేసి బయట నిలబెట్టారు పాఠశాల ప్రిన్సిపాల్ . ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి నగరంలో ప్రభుత్వ మహిళా పీయూ యూనివర్సిటీ కళాశాలలో చోటుచేసుకుంది.

No Entry: పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం..మూడు రోజులుగా ఆ విద్యార్థినుల పరిస్థితి..?

ప్రథమ, ద్వితీయ పీయూలకు చెందిన ఆరుగురు విద్యార్థులు హిజాబ్‌ ధరించి మూడు రోజులుగా కళాశాలలో రిపోర్టు చేస్తున్నారని.. అందుకు ప్రిన్సిపల్‌ రుద్ర గౌడ వారిని తరగతి గదుల్లోకి రానివ్వడం లేదని ఆరోపించారు. తమ మతపరమైన హక్కును గౌరవించాలని .. హిజాబ్‌తో తరగతులకు అనుమతించాలని బాలికల తరఫున విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను కోరుతున్నారు.

No Entry: పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం..మూడు రోజులుగా ఆ విద్యార్థినుల పరిస్థితి..?

విద్యాసంస్థ నిబంధనల ప్రకారం విద్యార్థినులు హిజాబ్ ధరించకుండా కళాశాలకు వస్తేనే అనుమతిస్తామని ప్రిన్సిపాల్ హుకూం జారీ చేశాడు. ఈ ఘటనను క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఖండించింది. అయితే కళాశాల అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు యశ్‌పాల్‌ సువర్ణ మాట్లాడుతూ.. తాము ప్రిన్సిపాల్‌ వెంటే ఉన్నామని.. కళాశాల విద్యా వాతావరణాన్ని పాడుచేయనివ్వబోమని అన్నారు.

అటెండెన్స్ తగ్గే అవకాశం ఉంది.. అనుమతివ్వండి..

కాలేజీ ప్రిన్సిపాల్ రుద్ర గౌడ ఈ విషయాలను స్పష్టం చేస్తూ.. ”ఇప్పటి వరకు ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించాలనే నిబంధన కాలేజీలో లేదు. అయితే, గత మూడు రోజుల నుండి.. మొత్తం 60 మంది ముస్లిం బాలికలలో ఆరుగురు విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తున్నారు. కాబట్టి మేము వారిని తరగతులకు అనుమతించలేదు. వారు హిజాబ్‌ను తొలగిస్తే తరగతులకు హాజరు కావచ్చు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమస్యపై చర్చించాం. వారు ఈ నియమాన్ని అర్థం చేసుకున్నారు.. అంతే కాదు వాళ్లు ఈ నిబంధనను అంగీకరించారని తెలిపాడు. కానీ ఈ విషయంపై ఆ బాలికల తల్లిదండ్రులు తాము ప్రిన్సిపాల్ తో ఈ విషయంపై మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. వారు ఈ విషయాన్ని స్థానికి మీడియాతో వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. క్లాస్ లోకి తమ పిల్లలను మూడు రోజులుగా అనుమంతించకపోవడంతో.. అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందని.. దయచేసి వాళ్లను అనుమతివ్వండి అంటూ వేడుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago