TDP-Congress: మళ్లీ ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్..! కలిసి బరిలోకి..!
TDP-Congress: రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు శత్రువులు, మిత్రులు ఉండరని చాలా సార్లు పెద్దలు చెబుతుంటారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాటను చెబుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. మొదటి నుంచి కూడా టీడీపీ, కాంగ్రెస్ ఒకరినొకరు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉన్నాయి.
2019లో జరిగిన ఎన్నికల సమయంలో కూడా బద్ద శత్రువులుగా భావించిన ఈ రెండు పార్టీలు కలిసి పోయి మరీ పోటీ చేశాయి. ఇక ఇదే తరహా పంథాను త్వరలో అండమాన్ నికోబార్లో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి.
ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ఏఎన్టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ పోర్టు బ్లెయిర్లో గాంధీ భవన్లో సమావేశమయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ విషయాలను వెల్లడించారు. అండమాన్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించామన్నారు. ఇక ఈ పొత్తులో భాగంగా మున్సిపాలిటీలోని వార్డులను పంచుకున్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఏ పార్టీ నుంచి చేయాలనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుందన్నారు. ఇక్కడ వచ్చేనెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.. మార్చి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే సమావేశంలో రంగలాల్ హల్దార్ మాట్లాడుతూ.. ఎవరేం చేసినా అభివృద్ధి కోసమే అని.. ప్రజాస్వామ్యయుత పాలన కోసం తాము టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు బరిలో దిగనున్నామన్నారు. తమను ప్రజలు ఆదరించాలని కోరారు.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…