వారికి తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. జలమండలి బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ పీఆర్సీ అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ నెల నుంచే జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు కానుంది.
నవంబరు నుంచే పెంచిన వేతనాలను చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. తమకు పీఆర్సీ అమలు చేయాలని ఎప్పటి నుంచే జలమండలి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ డిమాండ్ పై నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఖైరతాబాద్ జలమండలి ఎదుట ఎన్నో సార్లు ఇలా నిరసన చేపట్టారు.
గత నెలలో వాళ్లు .. అన్ని శాఖల వారికి పీఆర్సీ ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వరంటూ డిమాండ్ చేశారు. దాదాపు బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులంతా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి ఆ బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ పీఆర్సీ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంతో జలమండలిలో పనిచేస్తున్న దాదాపు 4 వేల మంది ఉద్యోగులకు వేతన పెంపు లభించనుంది. ఈ నెల నుంచే ఇది అధికారికంగా అమలు కానుంది. దీంతో జలమండలిలో పని చేస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దేవుడు అంటూ.. ప్రశంసలతో ముంచెత్తారు.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…