ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితులు ఎంతోమందిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. కొందరు ఉపాధి పనులు లేక రోజు వారి ఆకలి తీర్చుకోవడం కోసం కొట్టుమిట్టాడుతుంటే మరికొందరు కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో మంది చిన్నారులు అనాధలుగా మిగిలారు. ఈ మహమ్మారి దాటికి రోజు ఎంతో ఆప్యాయంగా పలకరించే వారికి కరోనా వచ్చిందని తెలిసి వారిని పలకరించడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇలాంటి దుర్భర పరిస్థితులలో బిహార్ లోని అరియా జిల్లాలో బిష్ణుపుర గ్రామపంచాయతీలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తండ్రి మరణించగా కరోనా బారినపడి నాలుగు రోజుల వ్యవధిలోనే తల్లి మరణించింది. ఈ విధంగా తల్లిదండ్రులను కోల్పోయి సోని(18), నితీష్ (14 ), చాందిని (12) అనే ముగ్గురు చిన్నారులు అనాధలుగా మిగిలారు.ఈ విధంగా తమ తల్లిదండ్రులు చనిపోతే వారి అంత్యక్రియలు నిర్వహించడానికి చేతిలో చిల్లిగవ్వ లేక పోవడంతో పెద్ద కూతురు సోని గ్రామస్తులు అందరిని తల్లి అంత్యక్రియలు నిర్వహించడం కోసం సహాయం అడిగింది. తనకు సహాయం చేయడానికి గ్రామస్తులు ఎవరు ముందుకు రాలేదు.
ఈ క్రమంలోనే సోనీ తన ఇంటి సమీపంలోనే తన తల్లి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. చనిపోయిన తమ తల్లిదండ్రులకు ఆత్మ శాంతి కలగాలని దశదిన కర్మకు భోజనాలు ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో భోజనం చేయడం కోసం 150 మంది గ్రామస్తులు వచ్చారు. కార్యక్రమానికి వచ్చిన వారందరూ కడుపునిండా భోజనం చేసి తమ తల్లి తండ్రుల ఆస్పత్రి ఖర్చులకోసం తమ వద్ద తీసుకున్న అప్పును చెల్లించాలని వారిపై ఒత్తిడి చేశారు.
ఇలాంటి సమయంలో ఏం చేయాలో దిక్కుతోచని సోనీ తమ తల్లిదండ్రుల ఆసుపత్రి ఖర్చుల కోసం చేసిన అప్పులు చెల్లించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదనకు గురైంది. ఎలాగైనా ప్రభుత్వం తమని ఆదుకోవాలని కన్నీటిపర్యంతమైన ఘటన బిష్ణుపుర గ్రామపంచాయతీలో చోటు చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…