మనం చూడటానికి వింతరూపంలో కనిపిస్తారు అఘోరాలు. ఒంటి నిండా బూడిద రాసుకొని.. జుట్టు మొత్తం శరీరం అంతా కలిసేట్లు.. కొంతమంది బట్టలు ధరించకుండా ఉంటారు. వీళ్లను చూస్తే కొంతమందికి వణుకు పుడుతుంది. చిన్న పిల్లలు అయితే భయపడి పోతుంటారు. అయితే తాజాగా అఘోరా విషయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సంచలనంగా మారింది.
ఏమైందంటే.. ఓ అఘోరాను.. ఓ మహిళ వివాహం చేసుకుంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా.. అరియమంగళానికి చెందిన మణికందన్ అనే అతడు అఘోరాగా మారాడు. అతడు కాశీలో అఘోరాగా ఉపాసన చేశాడు. తర్వాత కొన్నాళ్లకు స్వగ్రామం వచ్చి కాళీమాత విగ్రహం ఏర్పాటు చేశాడు.
అందులోనే పూజలు చేస్తూ ఉండేవాడు. అతడికి అప్పటికే కోల్ కత్తాకు చెందిన మహిళను వివాహమాడాడు. ఇదిలా ఉంటే.. ఇతడి దగ్గర ప్రియాంక అనే ఓ మహిళ గత ఎనిమిదేళ్లుగా శిక్షణ తీసుకుంటూ ఉంది. దీంతో ఆమె అతడిపై మోజుతో తాజాగా వివాహం చేసుకుంది.
ప్రియాంక శరీరం కూడా అఘోరాలాగే ఉంది. అతడు తాళి కట్టగానే పూజారి, అక్కడ ఉన్న తోటి అఘోరాలు ఆశీర్వదించారు. అక్కడ ఈ పెళ్లి వేడుకు ఓ పండగలా జరిపించారు అఘోరాలు. కళ్యాణం అనంతరం మరోసారి యజ్ఞం నిర్వహించి వారి స్టైల్లో హోమానికి నమస్కరించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…