There was no discussion on the Banakachars..: CM Revanth Reddy
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఢిల్లీలో జరిగిన కీలక సమావేశం అనంతరం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో అసలు బనకచర్ల ప్రాజెక్టు అంశంపై చర్చ జరగలేదని, దానిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
“భేటీలో వాళ్లు (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) బనకచర్ల కడతామని చెప్పలేదు. బనకచర్ల అంశంపై చర్చ జరగనప్పుడు.. దాన్ని ఆపాలనే చర్చ ఎక్కడ నుండి వస్తుంది?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కమిటీ ఏర్పాటుపైనే దృష్టి:
సమావేశం ప్రధానంగా కృష్ణా నది, గోదావరి నదిపై ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యలను చర్చించడానికి ఉద్దేశించబడిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నిపుణులు, అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఆ కమిటీ చర్చించిన తర్వాతే మిగతా అంశాలపై తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వివరించారు.
దీనితో, బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలకు, రేవంత్ రెడ్డి మాటలకు మధ్య వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కమిటీ నివేదిక తర్వాతే జల వివాదాలపై తదుపరి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…