బిగ్ బాస్ 5 వసీజన్ లో సన్నీ విజేతగా నిలిచారు. ఎప్పటి నుంచో సన్నీ, షణ్ముఖ్ మధ్య పోటీ ఉంటుందని అభిమానులు అంతా భావించారు. దీనికి అనుగుణంగానే ఫైనల్ లో వీరిద్దరి మధ్యే పోటీ నెలకొంది. ఎవరు ఎంతగా క్రిటిసైజ్ చేసినా.. సన్నీ తన ఆటను ఆడాడు. దీంతో ఫైనల్లో విన్నర్ గా నిలచాడు.
బిగ్ బాస్ లో సన్నీ ప్రయాణాన్ని గమనిస్తే .. అతని ఆటలో కొన్ని అంశాలు ముఖ్య పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ లోనే షణ్ముక్ తో జరిగిన ఆర్గ్యూమెంట్ తో హైలెట్ అయ్యాడు. అక్కడ్నుంచీ మిగతా హౌస్ మేట్స్ తనని టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నా కూడా అందర్నీ ఎంటర్ టైన్ చేస్తూ తనదైన స్టైల్లో గేమ్ ఆడాడు. బ్యాటిన్స్ టాస్క్ లో మగాడివైతే రా ఆడు అన్న ప్రియా మాటలకి రెచ్చిపోయాడు.
తనూ కూడా మాటకు మాట అంటూ చెలరేగిపోయాడు. దీంతో అప్పటి నుంచే సన్నీ ఆటను అభిమానులు గమనించడం ప్రారంభించారు. ఇదే టాస్క్ లో సిరి తన టీ షర్ట్ లో సన్నీ చేయిపెట్టాడని నిందలు వేయడం.. ఇవి అబద్దాలు అని నాగార్జున నిరూపించడం జరిగింది. తేరా నామినేషన్స్ జరిగేటపుడు హంటర్ గా అన్నిసార్లు తనే బయటకి వచ్చి నామినేషన్స్ ని స్వీకరించాడు. ఇక్కడ్నుంచే సన్నీ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. గుడ్ల టాస్క్ జరిగేటపుడు ప్రియా చెంప పగిలిపోద్ది అంటూ సన్నీపై విరుచుకపడినా కూడా తను టాస్క్ లో ఎంత జెన్యూన్ గా ఉన్నానో నిరూపించుకున్నాడు. దీంతో సన్నీ గేమ్ కి క్రేజ్ వచ్చింది.
టవర్ టాస్క్ ఆడేటపుడు సిరికి సన్నీకి జరిగిన గొడవలో సన్నీ హీరోగా మారాడు. ఎవిక్షన్ పాస్ ని తనకోసం సంపాదించి పెట్టిన కాజల్ కోసం వినియోగించి ఆడియన్స్ మనసులు దోచుకున్నాడు సన్నీ. అంతేకాదు, టాస్క్ లలో తన స్పాంటినిటీ జోక్స్, తన క్యారెక్టర్ తో ఫన్ చేయడం అనేది ఆడియన్స్ కి బాగా నచ్చింది
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…