Butter Milk Side Effects: మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ ఉండటం సర్వసాధారణం అయితే పెరుగుతో పోలిస్తే చాలామంది మజ్జిగ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మజ్జిగలో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉండడంతో ప్రతిరోజు మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని భావిస్తూ ఉంటారు.
ఇలా మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరం కూడా హైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుందని భావిస్తూ చాలామంది మజ్జిగ తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కాదని మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ప్రమాదంలో పడతామని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మనల్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పాలు పాల పదార్థాలలోనూ లాక్టోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చాలామందిలో జీర్ణక్రియను పూర్తిగా మందగించేలా చేస్తుంది. ఎవరికైతే లాక్టోస్ ను జీర్ణం చేసే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కావు లాంటివారికి మజ్జిగ తాగటం వల్ల అవి జీర్ణం కాక వాంతులు అయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాగే కడుపు నొప్పి రావడం కడుపు చాలా ఉబ్బర కావడం విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇలాంటి వారు ఎక్కువగా మంచిగా తీసుకోకపోవడం ఎంతో మంచిది.
చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి…
ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లలలో అధికంగా కనబడుతూ ఉంటుంది. అలాంటివారు రోజుకు కేవలం ఒక గ్లాస్ మజ్జిగ తాగడం మంచిది ఇక చాలా మంది మజ్జిగలో ఉప్పు అధికంగా వేసుకొని తాగుతూ ఉంటారు ఇలా అధికంగా ఉప్పు వేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉప్పు నిలువలు పెరిగిపోయి హై బీపీ రావడానికి కూడా కారణం అవుతుంది. ఇక మరికొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక రోజు ఒక గ్లాస్ కి మించి మజ్జిగ తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…