Featured

Kailasa parvatham mistery : కైలాస పర్వతంపై శివుడు నిజంగా ఉన్నాడా?? ఎందుకని ఎవరూ ఆ పర్వతం ఎక్కలేకపోతున్నారు…!

Kailasa parvatham mistery : ప్రపంచంలోని ఎత్తయిన పర్వాతాలను చాలా మంది అధిరోహించారు. ఏకంగా ఎవరెస్టును కూడా అధిరోహించారు. కానీ ఎవెరెస్టు కంటే తక్కువ ఎత్తులో ఉండే కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటికీ ఏ ఒక్కరూ ఎందుకు ఎక్కలేకపోయారు. అక్కడ అతీత శక్తులు ఉన్నాయా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మన భారతీయ సంస్కృతి రామాయణం, మహా భారతంను దాటి పక్కకు పోదు. చిన్నతనం నుండి మనం ఏదో ఒక సందర్బంలో రామాయణ, మహా భారత గాధలనే కథలుగా వింటూనే ఉన్నాం. అలా రామాయణంలో రావణుడి గురించి తెలుసుకున్నాం. రావణుడు శివని అపరభక్తుడు. ఆయన ఆత్మలింగాన్ని పొందడానికి ఆయన పది తలలను శివునికి అర్పించారు. ఈ విషయం మనం కథలలో తెలుసుకున్న ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. అది మరెక్కడో కాదు ఈ కైలాస పర్వతం మీదనే.

కైలాస పర్వతం మీద నిజంగానే శివుడు ఉన్నాడా…

కైలాస పర్వతంకి అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే, కౌలస అనే సంస్కృత పదం నుండి వచ్చింది. కౌలస అనగా స్పటికం అని అర్థం. కైలాస పర్వతం ఇప్పటి టిబెట్ ప్రాంతంలో అనగా నేడు చైనా ఆక్రమిత టిబెట్ లో ఉంది. దాదాపు ఎన్నో కోట్లమంది ప్రజలు ఈ కైలాస పార్వతంను ఆధ్యాత్మిక ప్రాంతంగా భావించి పూజిస్తున్నారు. ఇక ఈ పర్వతం ఎత్తు 6.6 కిలోమీటర్లు. ప్రపంచంలోని ఎన్నో ఎత్తయిన పర్వతాలలో ఇదీ ఒకటి. ఇక ఈ పర్వతాన్ని ఇప్పటివరకు ఎవరూ అధిరోహించలేదు కానీ పర్వతపు మొదలుకు వెళ్లి పూజలు చేస్తారు. అక్కడ ఉన్న రెండు సరస్సులు ఒకటి మానస సరోవర్ మరొకటి రాక్షస్థల్. మానస సరోవరం బ్రహ్మ మనసు నుండి పుట్టింది. ఇక ఇక్కడ మునక వేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని నమ్మకం. ఇది సూర్యుని వెలుగుకు ప్రతీక కాగా పక్కన ఉన్న రాక్షస్థల్ ఉప్పు నీటి సరస్సు. ఇది చంద్రుని ఆకారంలో ఉంటుంది. ఇందులో రావణాసురుడు తన ఒక్కోతలను ఒక్కోరోజు బలిగా శివునికి అర్పించాడని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ సరస్సులో ఎవరూ మునగరు.

ఇక మానస సరోవరం లో బ్రహ్మ ముహూర్తం సమయంలో అంటే వేకువ జామున కైలాస పర్వతం నుండి శివుడు వచ్చి స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సాక్ష్యంగా కైలాస పర్వతం నుండి ఆ సమయంలో మానస సరోవరం కు ఒక వెలుగు రావడం చూశామని చాలా మంది భక్తులు చెప్పారు. అయితే ఈ వెలుగు ఎందుకు వస్తోందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఇక ఈ పర్వతం వద్ద వృద్దాప్యం త్వరగా వస్తుంది, రెండు వారాలలో పెరగాల్సిన గోర్లు, వెంట్రుకలు 12 గంటలలోనే పెరుగుతాయి దీనికి కారణం ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఇది కూడా ఈ పర్వతాన్ని అధిరోహించక పోవడానికి కారణం. రేడియేషన్ అధికంగా ఉండే ఈ పర్వతం అధిరోహించడానికి ప్రయత్నించిన ఎంతో మంది విఫలం అయ్యారు. చైనా ప్రభుత్వం హెలీకాప్టర్ ద్వారా ఈ పర్వతం ఎక్కాలని ప్రయత్నించినా హెలీకాప్టర్ కూలిపోయింది. రెండు సార్లు పర్వతారోహకులకు ఎక్కడానికి అవకాశం కల్పించినా వారు విఫలమయ్యారు. అక్కడికి చేరుకున్న ఎంతో మంది మార్గం మధ్యలోనే అదృశ్యమయ్యారు. దీంతో ఇక ఇప్పుడు ఈ పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేదించారు. ఎంతో మంది మత విశ్వాసాలకు భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

2 days ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

2 days ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

2 days ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

2 days ago