మనం తినే ఆహారంలో ఆయిల్ గానీ.. కారం గానీ అధికంగా ఉంటే కడుపంతా మంటగా.. విసుగ్గా అనిపిస్తుంది. అందుకే.. మనం తినే ఆహారం ఎప్పుడూ తేలికపాటిగా ఉండాలి. అటువంటి సమయంలోనే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు.
మసాలాలు, నూనెలు తక్కువగా ఆహారంలో తీసుకోవాలి. అప్పుడే సరైన పోషకాలు శరీరానికి అందుతాయి. సరైన పోషకాలను అందించే తేలికపాటి ఆహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దక్షిణ భారతదేశంలో ప్రతీ ఒక్కరు ఇష్టపడే తేలికపాటి ఆహార పదార్థం అన్నంలో పెరుగు. ఇది కొన్ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ప్రతీ ఒక్కరూ చేసేదే.. అన్నంలో కొద్దిగా పెరుగు, ఉప్పు వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది.
అంతేకాకుండా అజీర్ణ సమస్య కూడా ఉండదు. కడుపులో ఇబ్బందిగా అనిపించినప్పడు ఖిచిడీని తింటే మంచిగా ఉంటుంది. ఇది చాలా తేలికగా ఉంటుంది. లూజ్ మోషన్ సమస్య ఉన్నవారికి ఇది ఒక రెమిడీ లాంటిది. దీనిలో బియ్యం, పప్పు, పసుపు, మసాలా దినుసులు కలిపి ఉండికించి.. వేడి వేడిగా తినేయాలి. కడుపు నొప్పిగా ఉండే వారికి ‘గుల్హత్’ ప్రయోజనకరంగా ఉంటుంది.
అర కప్పు బియ్యం, 2 కప్పుల నీరు, చిటికెడు ఉప్పు వేసి కుక్కర్లో పెట్టాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ తెరిచి బియ్యాన్ని మరింత మెత్తగా చేసుకోవాలి. దీనిని ఊరగాయతో తింటే అదిరిపోతుంది. ఇడ్లీ కూడా తేలికపాటి ఆహారమే. దీనిని తీసుకోవడం వల్ల కూడా అజీర్ణసమస్యలు తొలగిపోతాయి. పై తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…