Shanmukh-Deepthi: వాళ్లిద్దరు త్వరలోనే కలుస్తారు..! షణ్ముఖ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు..!
Shanmukh-Deepthi: బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు షణ్ముఖ్ అతడి ప్రేయసి దీప్తి సునయనా. వీరిద్దరు సోషల్ మీడియా స్టార్స్. ఫేమస్ లవ్ కపుల్స్ కూడా. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో, టీవీ షోలలో చాలా సార్లు వాళ్ళ ప్రేమ గురించి చెప్పారు.
ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లోనూ నటించారు.
ఇక ఇటీవల బిగ్ బాస్ షోలో సిరి, షణ్ముఖ్ సాగించిన వ్యవహారంతో బయటకు ఎక్కువగా ఎఫెక్ట్ అయింది మాత్రం షణ్ముఖ్ అనే చెప్పాలి. ఇలా దీప్తి సునయనా కూడా.. షణ్ముఖ్ తో బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి రిప్లై గా తాను హ్యాపీగా ఉండాలి అని బాధతో షణ్ముఖ్ కూడా పోస్ట్ చేశాడు. అయితే అప్పుడే షన్నుకి విడిపోవడం ఇష్టం లేదని, దీప్తినే బ్రేకప్ చెప్పిందని వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది. ఇటీవల దీప్తి సునయనా బర్త్ డే సందర్భగా షణ్ముక్ ఓ పోస్ట్ చేశాడు. విష్ చేసినా.. దీప్తి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీప్తి సునయనా దాదాపు షణ్ముక్ కు సంబంధించిన అన్ని జ్ఞాపకాలను చెరిపేసింది.
తాజాగా దీనిపై షణ్ముఖ్ తండ్రి స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ.. వాళ్లిద్దరు కలిసే ఉంటారని.. బ్రేకప్ చెప్పింది కేవలం దీప్తి మాత్రమే అని.. షణ్ముఖ్ చెప్పలేదు కదా అంటూ చెప్పాడు. వాళ్లిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువగా చర్చించకూడదు. కాకపోతే ఆ అమ్మాయికి ఏం అనిపించిందో తెలీదు కానీ సోషల్ మీడియాలో అలా పోస్ట్ పెట్టింది. ఇక వాళ్లు కలవడానికి కాస్త సమయం పడుతుంది అంటూ చెప్పాడు. ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. దీనిపై అభిమానులు అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పాడు. దీంతో షణ్ముఖ్, దీప్తి అభిమానులు దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వాళ్లిద్దరు కలవాలని కోరుకుంటున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…