Jacqueline - Fernandez: నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ గా భావించండి..వాటిని వైరల్ చేయొద్దు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన జాక్వెలిన్!
Jacqueline – Fernandez: బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో భాగంగా అరెస్టయిన సుకేష్ చంద్ర శేఖర్ తో ఎంతో సాన్నిహిత్యంగా ఉందని, ఆ కేసులో తనకు కూడా భాగం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణలో భాగంగా జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు.
ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)అధికారులు పలుమార్లు ఈమెకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఈమె కొన్నిసార్లు మాత్రమే విచారణకు హాజరైంది. తనకి ఈ మనీలాండరింగ్ కేస్ ఏ మాత్రం సంబంధం లేదని ఈమె చెబుతున్నప్పటికీ సుకేష్ చంద్రతో కలిసి జాక్విలిన్ అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోలలో వీరిద్దరు ఎంతో సన్నిహితంగా ఉంటూ ముద్దులు పెట్టుకోవడంతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని, మనీలాండరింగ్ కేసులో తనకు భాగం ఉందని అనుమానాలు బలపడ్డాయి.ఇలాంటి తరుణంలో ఎంతో మానసిక సంఘర్షణకు గురవుతున్న జాక్వలిన్ ఫెర్నాండెజ్ మీడియా, అభిమానులను ఉద్దేశిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు…
ఈ దేశం నా ప్రజలు ఎప్పుడూ నా పై ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తూనే వచ్చాయి అయితే ప్రస్తుతం నేను కఠిన పరిస్థితుల్లో ఉన్నాను. నేను పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆరోపణలు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. దయచేసి నా పై ఉన్న గౌరవాన్ని అలాగే ఉంచి నా ప్రైవసీకి భంగం కలిగించే ఆ ఫోటోలు (కిస్సింగ్ ఫొటోస్)వైరల్ చెయ్యొద్దు నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ గా భావించండి అంటూ జాక్వెలిన్ ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…