Jacqueline – Fernandez: బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో భాగంగా అరెస్టయిన సుకేష్ చంద్ర శేఖర్ తో ఎంతో సాన్నిహిత్యంగా ఉందని, ఆ కేసులో తనకు కూడా భాగం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణలో భాగంగా జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు.

ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)అధికారులు పలుమార్లు ఈమెకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఈమె కొన్నిసార్లు మాత్రమే విచారణకు హాజరైంది. తనకి ఈ మనీలాండరింగ్ కేస్ ఏ మాత్రం సంబంధం లేదని ఈమె చెబుతున్నప్పటికీ సుకేష్ చంద్రతో కలిసి జాక్విలిన్ అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలలో వీరిద్దరు ఎంతో సన్నిహితంగా ఉంటూ ముద్దులు పెట్టుకోవడంతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని, మనీలాండరింగ్ కేసులో తనకు భాగం ఉందని అనుమానాలు బలపడ్డాయి.ఇలాంటి తరుణంలో ఎంతో మానసిక సంఘర్షణకు గురవుతున్న జాక్వలిన్ ఫెర్నాండెజ్ మీడియా, అభిమానులను ఉద్దేశిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు…
నన్ను మీ ఇంటి బిడ్డగా భావించండి..
ఈ దేశం నా ప్రజలు ఎప్పుడూ నా పై ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తూనే వచ్చాయి అయితే ప్రస్తుతం నేను కఠిన పరిస్థితుల్లో ఉన్నాను. నేను పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆరోపణలు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. దయచేసి నా పై ఉన్న గౌరవాన్ని అలాగే ఉంచి నా ప్రైవసీకి భంగం కలిగించే ఆ ఫోటోలు (కిస్సింగ్ ఫొటోస్)వైరల్ చెయ్యొద్దు నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ గా భావించండి అంటూ జాక్వెలిన్ ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























