Political News

జగనన్న అసలు రూపం ఇదే.. సంచలన ట్వీట్ చేసిన వైయస్ షర్మిల !

హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో వైసీపీ అసలు ముఖం మరోసారి బయటపడిందని, ముసుగు తొలగిపోయి లోపల దాగి ఉన్న కాషాయ కండువా బయటపడిందని ఆమె ఘాటుగా విమర్శించారు. వైసీపీ అసలు బీజేపీ బీ-టీమ్ అని ఇప్పుడు దేశానికి తేటతెల్లమైందని అన్నారు.

This is Jagan’s real face.. YS Sharmila made a sensational tweet!

“మోదీకి జగన్ దత్తపుత్రుడే”

“మోదీకి జగన్ దత్తపుత్రుడేనని రాష్ట్ర ప్రజలకు ఈ మద్దతు కుండబద్దలు కొట్టినట్టే చూపించింది,” అని షర్మిల మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో మోదీ పక్షమే కొనసాగుతోందన్న వాస్తవం ఇప్పుడు మరింత స్పష్టమైందని ఆమె వ్యాఘ్యాణించారు. అవినీతి కేసుల భయంతో మళ్లీ బీజేపీకి దాసోహం అయ్యారని, ఐదు ఏళ్లు దోచుకున్నదాన్ని దాచుకోవడానికి మళ్లీ బీజేపీకి జైకొట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

రహస్య ఒప్పందాలపై షర్మిల విమర్శలు

చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురూ మోదీ తొత్తులేనని షర్మిల విమర్శించారు. వీరంతా బీజేపీకి ఊడిగం చేసే బానిసలేనని అన్నారు. టీడీపీ, జనసేనల పొత్తు తెరమీద జరిగిందని, కానీ వైసీపీది మాత్రం ఢిల్లీలో బీజేపీతో అక్రమ రహస్య ఒప్పందమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి పార్టీలతో కుస్తీ పడుతున్నట్టు నటిస్తూ, ఢిల్లీలో మాత్రం మతపిచ్చి బీజేపీతో చేతులు కలుపుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు.

తెలుగు ప్రజలకు ద్రోహం

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వైసీపీకి సిగ్గుచేటని షర్మిల అన్నారు. “దేశంలో ఓటు దొంగతనాలతో రాజ్యాంగం ఖూనీ అవుతున్నా, మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా వైసీపీ నోరు తెరపడం లేదు. దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని అభ్యర్థిగా నిలబెట్టాయి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ నిలబెట్టిన ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇస్తారా?” అని ప్రశ్నించారు. ఈ రాజకీయ ద్రోహంపై తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago