Liger Movie: పూరి జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా సందడి చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ మాస్ క్యారెక్టర్ లో నటిస్తుందని తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో భాగంగా రమ్యకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. . ” ఒక లయన్ కి టైగర్ కి పుట్టిన క్రాస్ బ్రీడ్ సాలా గాడే ఈ లైగర్” అని రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.
ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాలో ముందుగా విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం స్టార్ హీరో రణబీర్ భార్య అలియా భట్ కు దక్కిందట. ఈ కథ మొత్తం విన్న అలియా తన రేంజ్ కు తగ్గ సినిమా కాదంటూ రిజెక్ట్ చేశారు.
తనకు విజయ్ దేవరకొండతో నటించాలని ఉన్నప్పటికీ కథలో హీరోయిన్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో ఈమె వద్దని ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట.ఈ విధంగా అలియా భట్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం అనన్య పాండేకి వచ్చింది.అయితే ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత వచ్చిన ఆదరణ చూస్తుంటే అలియా ఈ సినిమాని మిస్ చేసుకున్నానని ఫీల్ అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానుండడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా కనుక అనుకున్న స్థాయిలో హిట్ అయితే అనన్య పాండేకు తెలుగులో కూడా అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…