Uday Kiran: మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం అదే… డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
Uday Kiran: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన కొంతమంది నటులలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఎంతో మంది దర్శక నిర్మాతలు ఉదయ్ కిరణ్ తో సినిమాలు చేయడానికి ఇష్టత చూపారు.
ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఉదయ్ కిరణ్ కి ఆ తరువాత మెల్లిమెల్లిగా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలు ఎదురయ్యాయి.అయితే అప్పటికే ఆయనకు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో నిశ్చితార్థం జరిగింది. ఇక నిశ్చితార్థం తర్వాత ఉదయ్ కిరణ్ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయనే మాటలు పూర్తిగా అవగాహన లేని మాటలని ప్రముఖ డైరెక్టర్ మోహన్ ఆల్రక్ ఒక ఇంటర్వూలో తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడున్నా టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తారని… అల్లు రామలింగయ్య తనని ఏ విధంగా అల్లుడిని చేసుకున్నారో ఉదయ్ కిరణ్ ను కూడా తాను అల్లుడిగా చేసుకోవాలని ఎంతో ఆశ పడ్డారని మోహన్ వెల్లడించారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి కూతురితో నిశ్చితార్ధం జరిగిన తరువాత ఉదయ్ కిరణ్ తనంతటతానే ఈ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పడం వల్ల వీరి వివాహం క్యాన్సిల్ అయిందని డైరెక్టర్ మోహన్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ఉదయ్ కిరణ్ అలా చెప్పడానికి గల కారణాలు మాత్రం తనకు తెలియదని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం డైరెక్టర్ మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…