అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో ఓ గుర్తు తెలియని వ్యాధి వేలాది పక్షుల పాలిట శాపంగా మారింది. ఈ వ్యాధి కారణంగా వేల సంఖ్యలో పక్షులు చనిపోతున్నాయి. ఎలా పక్షులు చనిపోవటానికి కారణం ఏంటని శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా పక్షుల చావుకు గల కారణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించలేక పోయారు.స్టార్లింగ్స్, బ్లూ జేస్, గ్రాకల్స్ వంటి అరుదైన పక్షులు చనిపోతున్న విధానాన్ని బట్టి చూస్తే పక్షులలో అంటు వ్యాధి వ్యాప్తి చెందినట్లు నిపుణులు గుర్తించారు.
ఇలాంటి వ్యాధి గత రెండు నెలల క్రితమే వర్జీనియా, వాషింగ్టన్, మేరీల్యాండ్ రాష్ట్రాల్లో పక్షులకు వ్యాప్తి చెందిన పక్షులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యాధి కెంటుకీ, డెలావేర్, విస్కాన్సిన్ రాష్ట్రాలకు వ్యాప్తి చెందినట్లు నిపుణులు తెలియజేశారు. ఈ వింత వ్యాధితో మరణించిన పక్షుల కళేబరాలను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్లో పోస్టుమార్టం జరుగుతోంది.
ఈ సందర్భంగా ఈ పరిశోధనలో పాల్గొన్న టాక్సికాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ లిసా మర్ఫీ మాట్లాడుతూ.. ఈ విధంగా పక్షుల మరణించడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని గుర్తించలేక పోతున్నామని తెలిపారు. ఈ విధంగా చనిపోయిన పక్షుల కనురెప్పలను చూసినప్పుడు వాటి వెనుక భాగంలో తెల్లటి క్రస్ట్ జమ అయినట్లు తేలిందన్నారు. ఈ కారణంతోనే పక్షులు చూపిన కోల్పోయినట్లు తెలిపారు. అదేవిధంగా పక్షుల మెదడుకు పక్షుల మరణానికి అనుసంధానం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ విధంగా మెదడుతో సంబంధం ఉన్న ఈ వ్యాధి పక్షులను తీవ్రంగా బాధపడుతున్నట్టు గుర్తించారు. అయితే ఈ విధంగా పక్షులు చనిపోవడానికి అసలు కారణం ఏంటన్న విషయాన్ని మాత్రం తెలియడం లేదు. పక్షులు ఏ వ్యాధి కారణం చేత మరణిస్తున్నాయనే విషయాన్ని గుర్తించే వరకు ప్రజలు పక్షులకు చాలా దూరంగా ఉండాలని ఈ సందర్భంగా నిపుణులు హెచ్చరించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…