Thrivikram Srinivas: బుట్ట బొమ్మని వదలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ముచ్చటగా మూడోసారి?
Thrivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి భీమ్లా నాయక్ చిత్రానికి దర్శక పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి ప్రాజెక్టును మహేష్ బాబుతో చేయనున్నారు. ఇప్పటికీ ఖలేజా, అతడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో కలిసి ముచ్చటగా మూడోసారి మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించడం కోసం మొదటగా సమంతను కన్ఫామ్ చేశారని ఆ తర్వాత పూజా హెగ్డే ను తీసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం గురించి కొంత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్ దర్శకత్వంలో ఇప్పటికే రెండు సినిమాలలో నటించిన అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ బుట్ట బొమ్మ అలా వైకుంఠపురం, అరవింద సమేత వంటి చిత్రాలలో నటించారు.
ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబుతో తీయబోయే మూడవ సినిమాలో హీరోయిన్ గా దాదాపు పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే కన్ఫామ్ అయితే ఈమె కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి హీరోయిన్ గా నటించినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…