Thrivikram Srinivas: బుట్ట బొమ్మని వదలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ముచ్చటగా మూడోసారి?
Thrivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి భీమ్లా నాయక్ చిత్రానికి దర్శక పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి ప్రాజెక్టును మహేష్ బాబుతో చేయనున్నారు. ఇప్పటికీ ఖలేజా, అతడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో కలిసి ముచ్చటగా మూడోసారి మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించడం కోసం మొదటగా సమంతను కన్ఫామ్ చేశారని ఆ తర్వాత పూజా హెగ్డే ను తీసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం గురించి కొంత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్ దర్శకత్వంలో ఇప్పటికే రెండు సినిమాలలో నటించిన అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ బుట్ట బొమ్మ అలా వైకుంఠపురం, అరవింద సమేత వంటి చిత్రాలలో నటించారు.
ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబుతో తీయబోయే మూడవ సినిమాలో హీరోయిన్ గా దాదాపు పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే కన్ఫామ్ అయితే ఈమె కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి హీరోయిన్ గా నటించినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…