Tik tak: టిక్ టాక్ ద్వారా ఎంతో మంది వారిలో ఉన్నటువంటి టాలెంట్ బయటపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చే సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయినటువంటి టిక్ టాక్ ఎంతో మందిని సెలబ్రెటీలుగా మార్చిందని చెప్పాలి. ఇలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయినటువంటి వారిలో దుర్గారావు దంపతులు ఒకరు.
టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈ దంపతులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే వీరికి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఏకంగా బుల్లితెర అవకాశాలు అలాగే వెండితెర అవకాశాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా వీరి చేసినటువంటి నాది నక్కలీసి గొలుసు అనే పాట ఎంతో ఫేమస్ అయిన విషయం మనకు తెలిసిందే.
ఈ పాట ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి దుర్గారావు దంపతులకు పలు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. అలాగే బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. అయితే ప్రస్తుతం వీరికి అవకాశాలు కాస్త తగ్గాయని చెప్పాలి. కేవలం యూట్యూబ్ వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో వీరికి అవకాశాలు తగ్గడంతో చేసేదేమీ లేక హైదరాబాద్లో స్థిరపడినటువంటి దుర్గారావు దంపతులు తిరిగి వారి సొంతూరికి వెళ్లిపోయారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే సొంత ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే సినిమాలలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తామని దుర్గారావు దంపతులు తెలియజేస్తున్నారు. ఇక యూట్యూబ్ వీడియోస్ ద్వారా నెలకు సుమారు30000 వరకు ఆదాయం పొందుతున్నారని తెలుస్తోంది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…