Tik tak: టిక్ టాక్ ద్వారా ఎంతో మంది వారిలో ఉన్నటువంటి టాలెంట్ బయటపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చే సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయినటువంటి టిక్ టాక్ ఎంతో మందిని సెలబ్రెటీలుగా మార్చిందని చెప్పాలి. ఇలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయినటువంటి వారిలో దుర్గారావు దంపతులు ఒకరు.
టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈ దంపతులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే వీరికి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఏకంగా బుల్లితెర అవకాశాలు అలాగే వెండితెర అవకాశాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా వీరి చేసినటువంటి నాది నక్కలీసి గొలుసు అనే పాట ఎంతో ఫేమస్ అయిన విషయం మనకు తెలిసిందే.
ఈ పాట ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి దుర్గారావు దంపతులకు పలు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. అలాగే బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. అయితే ప్రస్తుతం వీరికి అవకాశాలు కాస్త తగ్గాయని చెప్పాలి. కేవలం యూట్యూబ్ వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో వీరికి అవకాశాలు తగ్గడంతో చేసేదేమీ లేక హైదరాబాద్లో స్థిరపడినటువంటి దుర్గారావు దంపతులు తిరిగి వారి సొంతూరికి వెళ్లిపోయారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే సొంత ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే సినిమాలలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తామని దుర్గారావు దంపతులు తెలియజేస్తున్నారు. ఇక యూట్యూబ్ వీడియోస్ ద్వారా నెలకు సుమారు30000 వరకు ఆదాయం పొందుతున్నారని తెలుస్తోంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…