తిరుమల తిరుపతి పై వరుణుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత మూడు రోజుల నుంచి కుండపోతగా వర్షం కురవడంతో తిరుపతి జల సందిగ్ధంలో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఈ తిరుపతిని నువ్వే కాపాడాలి శ్రీనివాస అంటూ స్వామివారిని వేడుకుంటున్నారు. ఇక తిరుమల గిరులపై అధిక వర్షపాతం నమోదు కావడం చేత తిరుపతి నగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
కనుచూపుమేరా వరద నీరు పొంగిపొర్లడంతో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.ఈ క్రమంలోనే వరద ఉధృతికి ఎన్నో వాహనాలు కొట్టుకుపోగా మనుషులు పశువులు కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు వదులుతున్నారు. ఇక అధిక మొత్తంలో నీరు ఇళ్లలోకి చేరడం వల్ల ఇంటిలోని సామాన్లు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి.
ఎత్తయిన చెట్లు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి తిరుపతి మొత్తం చీకటిలో ఉండిపోయింది. ఈ విధమైనటువంటి దుర్భర పరిస్థితి నుంచి తిరుపతి నువ్వే కాపాడాలి స్వామి అంటూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఇలా తిరుపతిని వరద ముంచెత్తడంతో ప్రజలు కొంతమేర భయాందోళనకు గురవుతున్నారు.
ఎప్పుడో 1996 సంవత్సరంలో ఈ విధమైనటువంటి వార్తలు వచ్చాయని ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి వరద రాలేదని అక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు. ఇక తిరుమల కొండలలో వరద నీరు జలపాతాలను పోలి ఉన్నప్పటికీ అధిక వర్షపాతం నమోదు కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి.దీంతో భక్తులు ఎవరూ కూడా తిరుమలకు రాకూడదని ఆలయ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…