Bindhu Madhavi: టైటిల్ గెలుచుకున్న బిందుమాధవి.. తల్లిదండ్రులను హగ్ చేసుకొని ఎమోషనల్!
Bindhu Madhavi: బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో 24 గంటలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో 17 మంది కంటెస్టెంట్ లు ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాటిస్పేట్ చేశారు. ఇలా 17 మంది కంటెస్టెంట్ లతో పోటాపోటీగా మొదటినుంచి అన్ని టాస్క్ లలో పులిలా దూసుకుపోతూ చివరికి బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నారు బిందుమాధవి.
మొదటినుంచి అఖిల్, బిందుమాధవి మధ్య పెద్దఎత్తున టైటిల్ పోరు ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతూ ఆడారు. చివరికి ఆడపులి విజయం సాధించగా మరోసారి అఖిల్ రన్నర్ గా నిలిచారు. ఇక గ్రాండ్ ఫినాలేలో భాగంగా నాగార్జున గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో లోపలికి వెళ్లారు. ఇందులో డబ్బు ఉందని దీనిని తీసుకొని ఎవరైనా బయటకు వెళ్లొచ్చు అని చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో వారిద్దరినీ వేదికపైకి తీసుకువచ్చారు.
ఇలా వేదికపైకి రాగానే బిందుమాధవి విన్నర్ అంటూ ప్రకటించారు. ఇక మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ చరిత్రలోనే అమ్మాయి టైటిల్ గెలుచుకోవడం విశేషం. ట్రోఫీ అందుకున్న బిందు మాధవి వేదికపై ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులను గట్టిగా హగ్ చేసుకొని మీ కూతురు గెలిచిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బింధుమాధవి మాట్లాడుతూ సక్సెస్ అనేది ఎప్పుడైనా వస్తుంది. ఎవరు నిరుత్సాహ పడవద్దు.ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాని వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.ఒక వయస్సు వచ్చిన తర్వాత చాలామంది ఎన్నో మాటలు అంటారు. అయితే వాటిని పట్టించుకోకుండా మన ప్రయత్నం మనం చేయాలి అంటూ ఈ సందర్భంగా బిందుమాధవి వేదికపై మాట్లాడారు. ఇక ఈమె గెలుపొందడంతో సోషల్ మీడియా వేదికగా ఈమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…