Bindhu Madhavi: బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో 24 గంటలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో 17 మంది కంటెస్టెంట్ లు ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాటిస్పేట్ చేశారు. ఇలా 17 మంది కంటెస్టెంట్ లతో పోటాపోటీగా మొదటినుంచి అన్ని టాస్క్ లలో పులిలా దూసుకుపోతూ చివరికి బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నారు బిందుమాధవి.

మొదటినుంచి అఖిల్, బిందుమాధవి మధ్య పెద్దఎత్తున టైటిల్ పోరు ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతూ ఆడారు. చివరికి ఆడపులి విజయం సాధించగా మరోసారి అఖిల్ రన్నర్ గా నిలిచారు. ఇక గ్రాండ్ ఫినాలేలో భాగంగా నాగార్జున గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో లోపలికి వెళ్లారు. ఇందులో డబ్బు ఉందని దీనిని తీసుకొని ఎవరైనా బయటకు వెళ్లొచ్చు అని చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో వారిద్దరినీ వేదికపైకి తీసుకువచ్చారు.

ఇలా వేదికపైకి రాగానే బిందుమాధవి విన్నర్ అంటూ ప్రకటించారు. ఇక మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ చరిత్రలోనే అమ్మాయి టైటిల్ గెలుచుకోవడం విశేషం. ట్రోఫీ అందుకున్న బిందు మాధవి వేదికపై ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులను గట్టిగా హగ్ చేసుకొని మీ కూతురు గెలిచిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి
ఈ సందర్భంగా బింధుమాధవి మాట్లాడుతూ సక్సెస్ అనేది ఎప్పుడైనా వస్తుంది. ఎవరు నిరుత్సాహ పడవద్దు.ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాని వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.ఒక వయస్సు వచ్చిన తర్వాత చాలామంది ఎన్నో మాటలు అంటారు. అయితే వాటిని పట్టించుకోకుండా మన ప్రయత్నం మనం చేయాలి అంటూ ఈ సందర్భంగా బిందుమాధవి వేదికపై మాట్లాడారు. ఇక ఈమె గెలుపొందడంతో సోషల్ మీడియా వేదికగా ఈమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.






























