Nikhil Siddharth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు పరిచయమైనటువంటి నిఖిల్ అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నిఖిల్ సిద్ధార్థ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా నిఖిల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో శుభవార్తను పంచుకున్నారు. తన భార్య పల్లవి తల్లి కాబోతుంది అనే విషయాన్ని ఈయన వెల్లడించారు.
పల్లవి నిఖిల్ ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. పల్లవి వృత్తిపరంగా వైద్యరాలు. ఇక ఈ దంపతులు త్వరలోనే తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదే విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తాజాగా తన భార్య సీమంతపు వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మీ ఆశీర్వాదం కావాలి…
ఇలా సీమంతపు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి నిఖిల్.. తన భార్య పల్లవికి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో సీమంతం జరిగిందని తెలిపారు. త్వరలోనే మేము మా మొదటి బిడ్డకు స్వాగతం పలకపోతున్నామని తెలిపారు. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలి అంటూ నిఖిల్ ఈ సందర్భంగా చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలియడంతో నిఖిల్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…