Nikhil Siddharth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు పరిచయమైనటువంటి నిఖిల్ అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నిఖిల్ సిద్ధార్థ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా నిఖిల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో శుభవార్తను పంచుకున్నారు. తన భార్య పల్లవి తల్లి కాబోతుంది అనే విషయాన్ని ఈయన వెల్లడించారు.
పల్లవి నిఖిల్ ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. పల్లవి వృత్తిపరంగా వైద్యరాలు. ఇక ఈ దంపతులు త్వరలోనే తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదే విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తాజాగా తన భార్య సీమంతపు వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మీ ఆశీర్వాదం కావాలి…
ఇలా సీమంతపు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి నిఖిల్.. తన భార్య పల్లవికి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో సీమంతం జరిగిందని తెలిపారు. త్వరలోనే మేము మా మొదటి బిడ్డకు స్వాగతం పలకపోతున్నామని తెలిపారు. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలి అంటూ నిఖిల్ ఈ సందర్భంగా చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలియడంతో నిఖిల్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…