ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా తమకిష్టమైన సెలబ్రిటీస్ నుంచి రాజకీయ నాయకుల వరకు సోషల్ మీడియాలో చర్చించడం, హాష్ టాగ్ లతో పోస్టులు పెట్టడం ప్రస్తుతం కాలంలో ట్రెండ్ గా మారిపోయింది. తమకిష్టమైన సెలబ్రిటీస్ గురించి ట్రోల్ చేయడం నెటిజన్లకు అలవాటైపోయింది. అయితే ఈ సంవత్సరం ముగుస్తుండటంతో సోషల్ మీడియాలో ఎవరి గురించి ఎక్కువగా చర్చలు జరిగాయి, ఏ సెలబ్రిటీస్ గురించి ఎక్కువ ట్వీట్స్ పెట్టారనే విషయాన్ని ట్విట్టర్ అధికారకంగా వెల్లడించింది.
ఈ 2020 సంవత్సరంలో దక్షిణ భారత సూపర్ సినీ సెలబ్రిటీస్ వీళ్లేనంటూ టాప్ 10 సెలబ్రిటీస్ జాబితాను ట్విట్టర్ ఇండియా షేర్ చేసింది. ఈ జాబితాలో ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ ను బీట్ చేస్తూ మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నాడు.
ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో నిలువగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక మూడవ స్థానాన్ని తమిళ స్టార్ విజయ్ ఉండగా, నాలుగవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, అలాగే హీరో సూర్య ఐదవ స్థానంలో ఉన్నారు. ఈ హీరోలందరి గురించి ఈ సంవత్సరం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్వీట్ చేసినట్టు ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది.
ఇకపోతే దక్షిణాది హీరోయిన్ల విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయిన హీరోయిన్లలో మహానటి సావిత్రి టాప్ వన్ పొజిషన్ లో ఉన్నారు. రెండవ స్థానంలో కాజల్ అగర్వాల్, మూడవ స్థానంలో సమంత, నాలుగు, ఐదు స్థానాలలో రష్మిక, పూజా హెగ్డే చోటు దక్కించుకున్నట్లు ట్విట్టర్ జాబితాలో వెల్లడించింది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…