1991 తర్వాత USSR భౌగోళిక విచ్చిన్నం తర్వాత ప్రపంచం కాస్త ద్విధ్రువ ప్రపంచంగా ఆవిర్భవించింది. ఒకవైపు అమెరికా మరోవైపు రష్యా ప్రపంచ దేశాలను ఉద్రిక్త వాతావరణానికి గురిచేశాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ, ఆర్థిక విషయాల్లో పరోక్షంగా కలుగజేసుకున్నాయి. దీనినే మనం ప్రచ్ఛన్నయుద్ధం గా చెప్పుకోవచ్చు.
అయితే తెలుగు సినీ పరిశ్రమలో 1970 చివరి దశకం అలాగే 1980 ప్రారంభ దశకం వచ్చేసరికి దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావులు తెలుగు సినీ పరిశ్రమలో ద్విదృవాలుగా ఆవిర్భవించారా అనిపిస్తుంది.. ఒకరు ఎన్.టి.రామారావుతో సినిమా చేసి హిట్ కొడితే మరొకరు అక్కినేనితో సూపర్ హిట్టు కొట్టేవారు. ఇలా ఒకరిని మించి ఒకరు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు. ఒకసారి ఎన్టీ రామారావు మూవీ ఆర్డర్ ని చూస్తే…. 1976లో దాసరి నారాయణరావు ఎన్టీ రామారావు, జమున, మంజుల తో మనుషులంతా ఒకటే సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత 1977లో కె.రాఘవేంద్రరావు ఎన్టీ రామారావు, జయప్రద, జయసుధ లతో అడవిరాముడు సినిమా తీశాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 1979లో ఎన్టీరామారావు,శ్రీదేవి కాంబినేషన్ లో వేటగాడు తీసి సూపర్ హిట్ చేశారు. దాసరి నారాయణ రావు 1980లో మళ్లీ ఎన్.టి.రామారావు, శ్రీదేవిల తో సర్దార్ పాపారాయుడు సినిమా తీశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు ఎన్టీరామారావు శ్రీదేవి కాంబినేషన్ లో గజదొంగ సినిమా తీసి హిట్ చేశారు. మళ్లీ కే.రాఘవేంద్రరావు 1981లో ఎన్టీ రామారావు, శ్రీదేవిలతో కొండవీటి సింహం తీశారు. ఆ తర్వాత 1982లో దాసరి నారాయణ రావు ఎన్టీ రామారావు, శ్రీదేవి లతో బెబ్బులిపులి సినిమా తీసి బ్లాక్ బస్టర్ చేశారు. ఇదే సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు ఎన్టీ రామారావు శ్రీదేవి లతో జస్టిస్ చౌదరి సినిమా తీశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…