ఎక్కడైనా శివలింగం పెరగడం చూశారా.. లేదా విన్నారా.. అయితే ఇప్పుడు మీరు వినే మాట నిజమే. అక్కడ నిజంగానే శివలింగం పెరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్న ధాన్యం గింజ పరిమాణంలో ప్రతీ సంవత్సరం పెరుగుతుంది. ఇది అక్కడి భక్తులు కూడా స్వయంగా చప్పే మాట. ఇది శ్రీకాకులంలోని టెక్కలి మండలం రావివలస గ్రామంలో భారీ శివలింగం కొలువై ఉంది.
ఆ శివాలయాన్నే ఎండల మల్లిఖార్జున స్వామి అని పిలుస్తారు. పురాణాల్లో దీనిని సీతారాములు పూజాధికాలు నిర్వహించారని చెబుతున్నారు. ఇక్కడి శివలింగానికి దేవతలే ఆలయాన్ని కట్టినా అది నిలువలేదు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ఉండటం వల్ల ఆలయాన్ని ఎండల మల్లికార్జున స్వామి అని భక్తులు పిలుచుకుంటారు. పూర్వం దీనికి శ్రీకాకులం జిల్లాకు దగ్గర్లో ఉన్న ఒడిషా భక్తులు ఆలయం కట్టాలని నిర్ణయం తీసుకున్నారంట.
కానీ ప్రతీ ఏడాది శివలింగం పెరుగుతుండటంతో వారు ఆలయం కట్టడం విరమించుకున్నారంట. కోరుకున్న కోరికలు తీర్చే ఆలయంగా ఇక్కడ భక్తుల నమ్మకం. ఇదివరకు ఇలాంటి ఘటనలు జరిగాయని.. శివభగవానుడి దయవల్ల పుట్టిన ఆ పిల్లలకు మల్లన్న, మల్లమ్మా అని పేర్లు పెట్టుకోవడం కూడా జరిగిందని ఇక్కడి అర్చకులు చెబుతారు.
పర్యాటక శాఖ దేవాలయాల పర్యాటకంలో భాగంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఆలయం అభివృద్ధితో పాటు ఆదాయం పెరుగుతుందని స్థానికులు కోరుతున్నారు. ఎండల మల్లికార్జున స్వామి దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి భక్తులు రావడం విశేషం.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…