ఎక్కడైనా శివలింగం పెరగడం చూశారా.. లేదా విన్నారా.. అయితే ఇప్పుడు మీరు వినే మాట నిజమే. అక్కడ నిజంగానే శివలింగం పెరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్న ధాన్యం గింజ పరిమాణంలో ప్రతీ సంవత్సరం పెరుగుతుంది. ఇది అక్కడి భక్తులు కూడా స్వయంగా చప్పే మాట. ఇది శ్రీకాకులంలోని టెక్కలి మండలం రావివలస గ్రామంలో భారీ శివలింగం కొలువై ఉంది.
ఆ శివాలయాన్నే ఎండల మల్లిఖార్జున స్వామి అని పిలుస్తారు. పురాణాల్లో దీనిని సీతారాములు పూజాధికాలు నిర్వహించారని చెబుతున్నారు. ఇక్కడి శివలింగానికి దేవతలే ఆలయాన్ని కట్టినా అది నిలువలేదు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ఉండటం వల్ల ఆలయాన్ని ఎండల మల్లికార్జున స్వామి అని భక్తులు పిలుచుకుంటారు. పూర్వం దీనికి శ్రీకాకులం జిల్లాకు దగ్గర్లో ఉన్న ఒడిషా భక్తులు ఆలయం కట్టాలని నిర్ణయం తీసుకున్నారంట.
కానీ ప్రతీ ఏడాది శివలింగం పెరుగుతుండటంతో వారు ఆలయం కట్టడం విరమించుకున్నారంట. కోరుకున్న కోరికలు తీర్చే ఆలయంగా ఇక్కడ భక్తుల నమ్మకం. ఇదివరకు ఇలాంటి ఘటనలు జరిగాయని.. శివభగవానుడి దయవల్ల పుట్టిన ఆ పిల్లలకు మల్లన్న, మల్లమ్మా అని పేర్లు పెట్టుకోవడం కూడా జరిగిందని ఇక్కడి అర్చకులు చెబుతారు.
పర్యాటక శాఖ దేవాలయాల పర్యాటకంలో భాగంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఆలయం అభివృద్ధితో పాటు ఆదాయం పెరుగుతుందని స్థానికులు కోరుతున్నారు. ఎండల మల్లికార్జున స్వామి దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి భక్తులు రావడం విశేషం.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…