సంక్రాతి సందర్భంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషల్ లో వచ్చిన “అలా.. వైకుంఠపురములో…” చిత్రం. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. గీతా ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా షేర్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నాన్ బాహుబలి రికార్టులను అధిగమించింది. అయితే ఈ నేపథ్యంలో అసలు “అలా… వైకుంఠపురములో…” సినిమా తానందంటూ.. త్రివిక్రమ్ తన కథను కాపీ కొట్టాడంటూ ఒకతను త్రివిక్రమ్ మీద లీగల్ కేసు నమోదు చేసాడు.
“త్రివిక్రమ్ మోసగాడు.. 2005లో నేను త్రివిక్రమ్ కు వినిపించిన “అలా.. వైకుంఠపురములో.. ” కథను ఇప్పుడు సినిమా తీసి నన్ను మోసం చేసాడు అంటూ..” కేసు నమోదు చేసాడు.. కృష్ణ అనే దర్శకుడు.. గతంలో యుంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా సుబ్బు కు కథ రాసిన కృష్ణ ఇప్పుడు రైటర్స్ ప్రూఫ్స్ తో సహా షాకింగ్ కామెంట్లు చేసారు. 2013లో ఈ స్క్రిప్ట్ రిజిస్టర్ అయిందని. అయితే ఈ సినిమా తీయడం కోసం అన్ని రెడీ చేసుకున్న సమయంలో సేమ్ సినిమా వస్తుందని నేను సినిమా చేయబోయే నిర్మాతకి తెలియడంతో నా ప్రాజెక్ట్ పక్కకు పెట్టేసారు. తీరా సినిమా ఎవరు తీస్తున్నారా అని చుస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకు తాను “దశ దిశ” అని టైటిల్ పెట్టాలనుకున్నట్టు చెప్పుకొచ్చాడు కృష్ణ. త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు కూడా పంపిస్తానని చెబుతున్నాడు కృష్ణ.
అయితే దీనిపై త్రివిక్రమ్ అభిమానులు కృష్ణ పై మండి పడుతున్నారు. సినిమా విడుదలైన నెల రోజులకి ఈ కథ నీదని గుర్తొచ్చిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే త్రివిక్రమ్ కు ఇలాంటి ఆరోపణలు కొత్తేమీకాదు. గతంలో కూడా ఆయనపై ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. మరి ఇదీనిపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…