టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా ఎన్నికల నేపథ్యంలో మెగాబ్రదర్ నాగబాబు చేసిన హంగామా గురించి ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో భాగంగా ఇండియా ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. అయితే ఇందుకు కారణం నాగబాబు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ వదులుతున్నారు. అసలు మ్యాచ్ ఓడిపోవడానికి నాగబాబుకు కారణం ఏమిటనే విషయానికి వస్తే…
దుబాయ్ లో జరిగిన మ్యాచ్ చూడటం కోసం మెగాబ్రదర్ నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్ తో కలిసి వెళ్లారు. అయితే స్టేడియంకు వెళ్లి స్వయంగా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే చివరికి ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంతో అందుకు కారణం నాగబాబు అని కామెంట్ చేస్తున్నారు.
నాగబాబు ఐరన్ లెగ్ అని అతని ఎక్కడ కాలు పెడితే అక్కడ వాళ్ళు ఓటమి పాలు అవుతారని ఆయన పై పెద్ద ఎత్తున మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో తన అన్నచిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించగా ఆ పార్టీలోకి నాగబాబు వెళ్లడంతో ఏకంగా పార్టీ భూస్థాపితం అయింది. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించగా నాగబాబు మద్దతు తెలపడంతో పవన్ కళ్యాణ్ ఘోరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా పది రోజుల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలపగా.. ప్రకాష్ రాజు కూడా ఘోరంగా ఓటమి పాలయ్యాడు. ఇలా నాగబాబు మద్దతు తెలిపిన వారందరూ ఓటమి పాలవడంతో అతను ఒక ఐరన్ లెగ్ అని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు దుబాయ్ వెళ్లి ఇండియా మ్యాచ్ చూడటంతో మ్యాచ్ ఓడిపోవడానికి కూడా ఈయనే కారణమంటూ నెటిజన్లు పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…