ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు ఆన్లైన్ సంస్థలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఆఫర్లను చూడగానే కొందరు ముందు వెనుక ఆలోచించకుండా ఆ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.ఆ వస్తువులు అవసరం మనకు ఉన్నా లేకున్నా చాలామంది వాటిని వెంటనే ఆర్డర్ చేయడం ఒక అలవాటుగా ఉంటుంది.ఈ విధమైనటువంటి అలవాటు ఒకసారైతే ఫర్వాలేదు కానీ ఇది క్రమంగా అలవాటు పడితే భవిష్యత్తులో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
మనం నెలకు ఎక్కువ మొత్తంలో అంటే 70, 80 వేల వరకు సంపాదిస్తూ ఉంటే వాటిలో కొంత మొత్తాన్ని మన విలాసాల కోసం ఖర్చు పెట్టుకోవడం సర్వసాధారణమే. కానీ ఇదే క్రమంగా అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ 30 రోజుల ప్రణాళిక. 30 రోజుల ప్రణాళిక మనకు అనవసరమైన ఖర్చులను తగ్గించడమే కాకుండా ఆర్థిక క్రమశిక్షణను కూడా నేర్పుతుంది.
మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలని భావించినప్పుడు ఆ వస్తువును వెంటనే కొనకుండా ఒక 30 రోజులపాటు ఆ వస్తువులు కొనడానికి వాయిదా వేయాలి. ఈ విధంగా 30 రోజులు వాయిదా వేసిన తర్వాత కూడా ఆ వస్తువు అవసరం మనకు ఉండి దానిని కొనాలి అనిపిస్తే అప్పుడు ఆ వస్తువులు కొనాలి. లేకపోతే అది అంతటితో మర్చిపోవాలి.
కొన్నిసార్లు మనం ఆవేశంతో కొన్ని వస్తువుల ఉపయోగం మనకు పెద్దగా అనిపించదు.ఆ వస్తువును కొనాలనే ఆలోచన కేవలం అప్పటికి మాత్రమే రావడం వల్ల దానిని కోరకు అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తుంటాము. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే మీరు కొనాలనుకునే వస్తువుకు సరిపడా డబ్బులను తీసి పక్కన పెట్టాలి.30 రోజుల తర్వాత కూడా మీకి ఆ వస్తువు అవసరం ఉన్నప్పుడు పక్కన ఉంచిన డబ్బులను తీసుకొని వాటిని కొనుగోలు చేయాలి. లేదా మీకు ఏమి అవసరం లేదనుకుంటే ఆ డబ్బును మీ భవిష్యత్తు ప్రణాళిక కోసం ఉపయోగించాలి.ఈ విధమైనటువంటి 30 రోజుల ప్రణాళిక మీరు అలవర్చుకుంటే కాలక్రమేణా మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం వల్ల భవిష్యత్తులో మీరు ఆర్థిక అభివృద్ధిలో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…